Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతిలో గత ప్రభుత్వ నిర్వాకం.. రూ.300కోట్ల అదనపు భారం

గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాజధాని అమరావతిలో భవనాలు పూర్తి కాలేదని, అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ లను నిర్మించేందుకు ఖర్చు కూడా పెరిగిందని, ఈ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అదనంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 9 మాసాల్లో నిర్మాణాలను పూర్తి చేయాలని సిఆర్డిఏ అధికారులకు స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.

ఎంఎల్ఏ,ఎంఎల్సిల క్వార్టర్స్ పనులను పరిశీలించిన స్పీకర్
అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఎంఎల్ఏ,ఎంఎల్సిల నివాస సముదాయ భవనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సిఆర్డిఏ,అసెంబ్లీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎంఎల్ఏ,ఎంఎల్సి నివాస సముదాయంలో వివిధ గదులను శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు పరిశీలించారు.

Speaker Ayyannapatrudu slams negligence of previous govt in Amaravati Additional expenditure of Rs 300 crore

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన నిర్మాణ పనులు
అనంతరం ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర శాసన సభ,శాసన మండలి సభ్యులందరికీ కలిపి 288 నివాసాలు కల్పించేందుకు రాయపూడి వద్ద 12అంతస్తులతో కూడిన 12 టవర్ల నిర్మాణాన్ని గత టిడిపి ప్రభుత్వం హయాంలో చేపట్టిందని చెప్పారు. 2019 నాటికి 77 శాతం పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిలిపి వేసి నిర్లక్ష్యం చేయడంతో నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయన్నారు.

గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పెరిగిన అంచనా వ్యయం
క్వార్టర్ లలో పిచ్చి మొక్కలు మొలిచాయని అన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల ఆయా పనులన్నిటినీ తిరిగి ప్రారంభించి పూర్తి చేసేందుకు అంచనా వ్యయం భారీగా పెరగడంతో పాటు గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గత ఐదేళ్ళుగా పనులు నిలిపి వేయడంతో చాలా వరకూ నిర్మాణ సామాగ్రి తుప్పు పట్టడం,కొంత మెటీరియల్ దొంగల పాలు కావటం వంటి సంఘటనలు జరిగాయన్నారు.

9 మాసాల్లోగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి
అమరావతి రాజధానిలో ఎంఎల్ఏ, ఎంఎల్సిలకు,ఇతర ఉన్నతాధికారులు,సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలు హైదరాబాదులో కూడా లేవని ఆయన పేర్కొన్నారు. కావున ఈభవన సముదాయానికి సంబంధించిన ఫినిషింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి 9 మాసాల్లోగా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సిఆర్డిఏ అధికారులను కోరినట్టు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+