జగన్ మైక్ కట్ చేసిన స్పీకర్: సభలో దుమారం
హైదరాబాద్: బడ్జెట్పై ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మైకును స్పీకర్ కోడెల శివప్రసాద రావు మైక్ కట్ చేయడంతో గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. జగన్ మాట్లాడుతుండగా మీకు కావాల్సినంత సమయం ఇవ్వలేమని, సమయం అయిపోయిందంటూ స్పీకర్ మైక్ను కట్ చేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.
వైసిపి సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. కాగితాలు చించి విసిరేశారు. ఈ స్థితిలో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో స్పీరక్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యనే మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వెళ్లారు. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ను కార్నర్ చేయడమే పనిగా పెట్టుకున్నారని మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు.

తమ నేత వైయస్ జగన్కు మరింత సమయం ఇవ్వాలని వైసిపి సభ్యులు స్పీకర్ను కోరారు. దానికి స్పీకర్ నిరాకరించారు. అచ్చెన్నాయుడు జగన్పై ఎదురుదాడికి దిగారు. ఆర్థిక విషయాలు తెలియనివారు కూడా సభలో మాట్లాడుతున్నారని జగన్ అన్నారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోవాలని ఆయన అన్నారు. ఎదుటివారిపై రాళ్లు వేయడం సరి కాదని, కొంచెం బుర్ర కూడా ఉపయోగించాలని జగన్ అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications