సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు: ప్రయాణికులకు ఉపశమనం
సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో మరో ఆరు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది.
హైదరాబాద్: సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో మరో ఆరు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఇందులో నాలుగు రైళ్లు కాకినాడపోర్టు-సికింద్రాబాద్, కాకినాడపోర్టు-నాందేడ్ల మధ్య.. రెండు రైళ్లు మధ్య తమిళనాడులోని మధురై నుంచి విజయవాడల మధ్య రాకపోకలు సాగించనున్నాయి.
జనవరి 13 నుంచి 16వ తేదీల మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం ఉమాశంకర్కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లతో ప్రయాణికుల రాకపోకల ఇబ్బందులు తీరనున్నాయి.
సీఎం చేతుల మీదుగా సంక్రాంతికి ఎస్వీబీసీ-2 ఛానల్!
ఎస్వీబీసీ-2 పేరిట తమిళ ఛానల్ను తిరుమల తిరుపతి దేవస్థానం సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎంచంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తోంది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ను 2008లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ప్రారంభించారు. తాజా తమిళ ఎస్వీబీసీ ఛానల్తో తమిళ భక్తులు శ్రీవారి సేవలను ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించనున్నారు.