టిపై వట్టి కాదు నేనే: శ్రీధర్, నేతల నుండి ఆజాద్ ఆరా
తెలంగాణలో పరిస్థితిపై ఆజాద్ ఆరా
కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్తో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డిలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో పార్టీ పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స నారాయణ సమక్షంలో ఆజాద్ సెక్యూరిటీ జర్నలిస్టులను నెట్టివేసింది.
రాష్ట్రపతిని కలువనున్న టి నేతలు
ఈ నెల 16వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ ప్రాంత అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కలువనున్నారు. విభజన ముసాయిదా బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. సీమాంధ్ర నేతలు మరింత గడువు కోరే అవకాశముంది. ఈ నేపథ్యంలో గడువు పెంచవద్దని వారు రాష్ట్రపతిని కలిసి కోరే అవకాశముంది.
అలాగే సభ జరుగుతున్న తీరును కూడా ఆయనకు వారు వివరించనున్నారు. బిల్లుపై చర్చకు గడువు పెంచవద్దని రాష్ట్రపతిని కోరుతామని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. నలభై రోజుల సమయం ఇచ్చినా ఇంకా గడువు కావాలని కోరడం సరికాదన్నారు.