రూ. 460 కోట్లతో భక్తుల కోసం భారీ టౌన్ షిప్- నాలుగు బ్లాకుల్లో: అన్నీ అక్కడే
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 84,014 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 35,131 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.69 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది.
శ్రీవారి వైభవాన్ని దేశం నలువైపులా వ్యాప్తి చేయడానికి టీటీడీ పలు నిర్ణయాలను తీసుకుంది. వీటి గురించి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. టీటీడీ స్థానిక, అనుబంధ ఆలయాలలో మార్చి నెల లోపు భక్తులకు రెండు పూటలా అన్నప్రసాదాలు అందించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే టీటీడీలోని 56 ఆలయాలలో ప్రస్తుతం 17,000 మందికి దాతల సహకారంతో అన్నప్రసాదాల వితరణ జరుగుతోంది.

భక్తుల నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా రూ.25.60 కోట్లతో తిరుమలలో ఏటీజీహెచ్ నుండి అక్టోపస్ బిల్డింగ్ వరకు ఔటర్ రింగ్ రోడ్డులో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ. ఒంటిమిట్ట మాస్టర్ ప్లాన్ లో భాగంగా రూ.37 కోట్లతో 100 గదుల నిర్మాణం, రూ.16.5 కోట్లతో 108 అడుగుల జాంబవంతుని విగ్రహం నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇతర ఆలయాల అభివృద్ధికి టీటీడీ ఇతోధికంగా ఆర్థిక సహాయం అందిస్తోంది.
రాజధాని అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఆలయం ఇది. రూ.92 కోట్లతో రెండో ఆలయ ప్రాకారం, కల్యాణోత్సవ మండపం, రాజగోపురం తదితర అభివృద్ధి పనులు రెండేళ్ల కాలంలో పూర్తి చేయనుంది టీటీడీ. ఇక్కడ రెండు పూటలా అన్నప్రసాద వితరణ చేయడానికి చర్యలు తీసుకుంటోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం పీఏసీ 5 అందుబాటులోకి వచ్చింది. దీన్ని మరింత విస్తరించడానికి టీటీడీ ప్రణాళికలు వేస్తోంది.
మాస్టర్ ప్లాన్లో భాగంగా అలిపిరి సమీపంలో భక్తుల వసతి, అనుబంధ సదుపాయాల కోసం రూ.460 కోట్లతో నాలుగు బ్లాకులుగా టీటీడీ టౌన్ షిప్ నిర్మించనుంది. తిరుమల కొండలలో అటవీ విస్తీర్ణం పెంచడానికి, జీవ వైవిధ్య పునరుద్ధరణ, హరిత అభివృద్ధికి గాను 10 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికకు చర్యలు తీసుకుంటోంది. తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ సహకారంతో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, వారు ఎక్కువ సేపు క్యూలైన్లలో వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం, భద్రత కల్పిస్తున్నాం.
-
రాములవారి సేవలో శ్రీవారి సేవకులు, అరుదైన ఘట్టం - కన్నుల పండువగా..!! -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications