జేసీబీపై కార్మికుడు: పోలీసులు కిందకు ఈడ్చారు, తల పగిలింది (ఫోటోలు)
విశాఖపట్నం: విశాఖపట్నంలోని బీచ్ రోడ్డు వైఎంసీఏ వద్ద చెత్త తొలగిస్తున్న ప్రైవేటు వర్కర్లను గురువారం సాయంత్రం జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకోగా, వారిని చెదగొట్టేందుకు పోలీసులు కార్మికులపై లాఠీఛార్జి చేశారు. దీంతో వారు తీవ్ర గాయాలపాలయ్యారు.
దీంతో పలువురిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. బీచ్ రోడ్డు వైఎంసీఏ వద్ద చెత్త ఎత్తడానికి ప్రయత్నించిన బయట వ్యక్తులను ప్రస్తుతం ధర్నా చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు.
కార్మికుడి తల పగిలింది, సమ్మె ఉధృతం
విశాఖలోని బీచ్ రోడ్డు వైఎంసీఏ వద్ద చెత్త తొలగిస్తున్న ప్రైవేటు వర్కర్లను గురువారం సాయంత్రం జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకోగా, వారిని చెదగొట్టేందుకు పోలీసులు కార్మికులపై లాఠీఛార్జి చేశారు.
కార్మికుడి తల పగిలింది, సమ్మె ఉధృతం
తమ డిమాండ్లను నెరవేర్చేవరకు అందుకు ఒప్పుకోబోమని చెప్పారు. అయితే, అక్కడికి వచ్చిన పోలీసులు కార్మికులపై లాఠీఛార్జి చేశారు.
కార్మికుడి తల పగిలింది, సమ్మె ఉధృతం
దీంతో బీచ్ రోడ్డు ఘటనపై సీఐటీయూ ఆధ్వర్యంలో చేసిన ఆందోళన ఉధృతంగా మారింది.
కార్మికుడి తల పగిలింది, సమ్మె ఉధృతం
దీంతో పారిశుద్ధ్య కార్మికులు చెత్త ఎత్తుతున్న జేసీబీ మిషన్లకు అడ్డంగా వెళ్లారు.
కార్మికుడి తల పగిలింది, సమ్మె ఉధృతం
ఈ సందర్భంగా రెల్లివీధికి చెందిన వడ్డి గంగాధర్ జేసీబీ మిషన్పైకి ఎక్కడంతో పోలీసులు అతడిని కిందకు ఈడ్చారు. దీంతో గంగాధర్ తలకు, చేతులకు గాయాలయ్యాయి.
కార్మికుడి తల పగిలింది, సమ్మె ఉధృతం
దీనిపై జీవీఎంసీ జోనల్ కమిషనర్ నల్లయ్యను కాంట్రాక్ట్ కార్మికులు నిలదీశారు.