స్వచ్ఛ భారత్లో భాగంగా పరిసరాలు శుభ్రం చేస్తూ కోమాలోకి విద్యార్థి, ఆసుపత్రిలో మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలం భీమవరం గ్రామంలో శుక్రవారం ఓ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయిచంద్ (14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువ
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలం భీమవరం గ్రామంలో శుక్రవారం ఓ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయిచంద్ (14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అతను గురువారం పాఠశాలకు వెళ్లాడు.
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులతో పరిసరాలను శుభ్రం చేయిస్తోంది. ఈ సమయంలో విద్యార్థి ఓ చెట్టు కొమ్మను లాగాడు. దీంతో అది కూలింది.

అతనికి గాయాలయ్యాయి. అతనిని వెంటనే ఆకివీడు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అతను కోమాలోకి వెళ్లాడని, అతని బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు వెల్లడించారు. అనంతరం అతను శుక్రవారం సాయంత్రం కన్నుమూశాడు.
విద్యార్థి అంత్యక్రియలు శనివారం జరిగాయి. స్కూల్ యాజమాన్యం అంతిమయాత్రకు హాజరైంది. స్కూల్ యాజమాన్యం భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ కొడుకు మరణించాడని తల్లిదండ్రులు కంటతడి పెట్టారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications