స్వచ్ఛ భారత్లో భాగంగా పరిసరాలు శుభ్రం చేస్తూ కోమాలోకి విద్యార్థి, ఆసుపత్రిలో మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలం భీమవరం గ్రామంలో శుక్రవారం ఓ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయిచంద్ (14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువ
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలం భీమవరం గ్రామంలో శుక్రవారం ఓ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయిచంద్ (14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అతను గురువారం పాఠశాలకు వెళ్లాడు.
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులతో పరిసరాలను శుభ్రం చేయిస్తోంది. ఈ సమయంలో విద్యార్థి ఓ చెట్టు కొమ్మను లాగాడు. దీంతో అది కూలింది.

అతనికి గాయాలయ్యాయి. అతనిని వెంటనే ఆకివీడు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అతను కోమాలోకి వెళ్లాడని, అతని బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు వెల్లడించారు. అనంతరం అతను శుక్రవారం సాయంత్రం కన్నుమూశాడు.
విద్యార్థి అంత్యక్రియలు శనివారం జరిగాయి. స్కూల్ యాజమాన్యం అంతిమయాత్రకు హాజరైంది. స్కూల్ యాజమాన్యం భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ కొడుకు మరణించాడని తల్లిదండ్రులు కంటతడి పెట్టారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications