విద్యార్థుల నిరసన, పావురాలు ఎగిరేసి (పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం కమ్మెన్స్మెంట్ డే నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాగింగ్కు వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. బంజారాహిల్స్లోని కళాశాల ఆవరణలో వారు ర్యాగింగ్కు వ్యతిరేకంగా వేసిన కార్టూన్లు, ప్లకార్డులను ప్రదర్శించారు.
ముఖ్య అతిథిగా ఏపి ఏసిబి డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్, గౌరవ అతిథిగా ఇన్ఫోసిస్ సంస్థ శిక్షణ విభాగాధిపతి శ్రీనగేష్ ‘యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్' టీషర్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏకే ఖాన్ మాట్లాడుతూ.. ‘పదో తరగతి వరకూ చదవడం ఓ ఎత్తు. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు మరో ఎత్తు. చాలా మంది విద్యార్థులు మాత్రమే కాదు తల్లిదండ్రులు కూడా ఇంజినీరింగ్లో చేరగానే రిలాక్ష్ అయిపోతారు. అయితే భవిష్యత్కు పునాది వేసుకోవడానికి కీలక సమయం ఇది' అని అన్నారు.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువు పట్ల శ్రద్ద వహించాల్సి ఉందని అన్నారు. ఇప్పుడున్న పోటీ యుగంలో రాణించాలంటే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వినూత్నంగా ఆలోచించడంతోపాటు ఇతరులతో కలిసి పని చేయడం, స్వీయ ఆలోచనలకు పదును పెట్టడం చేసినప్పుడు భవిష్యత్లో రాణించగలరని తెలిపారు. ప్రతి చోట మంచి, చెడు ఉంటాయాన్న ఆయన, మనం ఎంచుకున్న మార్గమే మన భవిష్యత్ను నిర్దేశిస్తుందని అన్నారు.
ఏకే ఖాన్
నగరంలోని ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం కమ్మెన్స్మెంట్ డే నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు.
పావురం ఎగరేస్తూ..
ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏపి ఏసిబి డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్, గౌరవ అతిథి ఇన్ఫోసిస్ సంస్థ శిక్షణ విభాగాధిపతి శ్రీనగేష్లు పావురాలను ఎగరేస్తున్న దృశ్యం.
నిరసన
ఈ సందర్భంగా ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు ర్యాగింగ్కు వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు.
నిరసన
ఈ సందర్భంగా ఏకే ఖాన్ మాట్లాడుతూ.. ‘పదో తరగతి వరకూ చదవడం ఓ ఎత్తు. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు మరో ఎత్తు. చాలా మంది విద్యార్థులు మాత్రమే కాదు తల్లిదండ్రులు కూడా ఇంజినీరింగ్లో చేరగానే రిలాక్ష్ అయిపోతారు. అయితే భవిష్యత్కు పునాది వేసుకోవడానికి కీలక సమయం ఇది' అని అన్నారు.
ఆవిష్కరణ
ముఖ్య అతిథిగా ఏపి ఏసిబి డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్, గౌరవ అతిథిగా ఇన్ఫోసిస్ సంస్థ శిక్షణ విభాగాధిపతి శ్రీనగేష్ ‘యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్' టీషర్టులను ఆవిష్కరించారు.
ఆవిష్కరణ
తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువు పట్ల శ్రద్ద వహించాల్సి ఉందని ఏకే ఖాన్ అన్నారు.
ఏకె ఖాన్
ఇప్పుడున్న పోటీ యుగంలో రాణించాలంటే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వినూత్నంగా ఆలోచించడంతోపాటు ఇతరులతో కలిసి పని చేయడం, స్వీయ ఆలోచనలకు పదును పెట్టడం చేసినప్పుడు భవిష్యత్లో రాణించగలరని తెలిపారు.
ఏకే ఖాన్
ప్రతి చోట మంచి, చెడు ఉంటాయాన్న ఆయన, మనం ఎంచుకున్న మార్గమే మన భవిష్యత్ను నిర్దేశిస్తుందని అన్నారు.