తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిటిడి సభ్యురాలిగా సుధామూర్తి ప్రమాణం, శేఖర్ రెడ్డి స్థానంలో సుధామూర్తి నియామకం

సామాజిక కార్యకర్త సుధామూర్తి ఆదివారం నాడు టిటిడి సభ్యురాలిగా ప్రమాణం చేశారు.తిరుమల దేవాలయంలో టిటిడి ఈవో సాంబశివరావు సుధామూర్తితో టిటిడి సభ్యురాలిగా ప్రమాణం చేయించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుమల:సామాజిక కార్యకర్త సుధామూర్తి ఆదివారం నాడు టిటిడి సభ్యురాలిగా ప్రమాణం చేశారు.తిరుమల దేవాలయంలో టిటిడి ఈవో సాంబశివరావు సుధామూర్తితో టిటిడి సభ్యురాలిగా ప్రమాణం చేయించారు.

చెన్నైలో ఇటీవల ఆదాయపుపన్నుశాఖ అరెస్టు చేసిన శేఖర్ రెడ్డిని టిటిడి సభ్యుడిగా తొలగించారు. దీంతో ఖాళీగా ఉన్న ఈ స్థానంలో సుధామూర్తిని నియమిస్తూ ఎపి సర్కార్ నిర్ణయం తీసుకొంది.

తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొన్న అనంతరం ఆమె టిటిడి సభ్యురాలిగా బాధ్యతలను స్వీకరించారు.

Sudha Murthy takes oath as TTD member

స్వామి వారి దర్శనం చేసుకొన్న తర్వాత ఆమెకు తీర్థప్రసాదాలను అందించారు.అంతేకాదు స్వామి వారి ఫోటోను కూడ దేవాలయాధికారులు బహుకరించారు.

తనకు భగవంతుడికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఆమె దేవస్థాన బోర్డుకు ధన్యవాదాలు తెలిపారు. ఆరు దశాబ్దాల తర్వాత తిరుమలను తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొన్నట్టుగా ఆమె తెలిపారు.

చెన్నైకు చెందిన శేఖర్ రెడ్డి జయలలిత మరణం తర్వాత ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తే భారీగా నగదు, బంగారం ఆయన నుండి అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ పరిణామాలతో శేఖర్ రెడ్డిని టిటిడి సభ్యుడిగా బాధ్యతల నుండి తప్పించారు.

English summary
Social worker Sudha Murthy on Sunday took oath as member of the trust board of the Tirumala Tirupati Devasthanams (TTD). TTD executive officer D Sambasiva Rao administered the oath at the Tirumala temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X