‘బాబు గారూ! మీ మనసు నొప్పించివుంటే మన్నించండి!! ’
తనను మన్నించాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ధర్మవరంలో తలెత్తిన వివాద విషయమై ఈ మేరకు స్పందించారు ఎమ్మెల్యే సూర్యనారాయణ.
అనంతపురం: తనను మన్నించాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ధర్మవరంలో తలెత్తిన వివాద విషయమై ఈ మేరకు స్పందించారు ఎమ్మెల్యే సూర్యనారాయణ.
తాను సీఎం చంద్రబాబునాయుడి మనసు నొప్పించి ఉంటే మన్నించాలని ఎమ్మెల్యే సూర్యనారాయణ కోరారు. అసలు విషయంలోకి వెళితే.. ధర్మవరంలో విద్యుత్ కేబుల్ లాగే విషయంలో మంత్రి పరిటాల, సూరి వర్గీయుల మధ్య మొదలైన వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది.

తమ అనుచరులను అన్యాయంగా కొట్టారంటూ ఎమ్మెల్యే.. శనివారం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి వినతిపత్రం అందించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతరు చేయడం వల్లనే సమస్య వచ్చిందన్నారు ఎమ్మెల్యే సూర్యనారాయణ. తమ కార్యకర్తలకు గాయాలు కావడం చూసి తట్టుకోలేకే తాను స్పందించానని.. ఈ విషయంలో అధినేత మనసు నొప్పించి ఉంటే మన్నించాలని విజ్ఞప్తి చేశారు.
-
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్కు స్టేషన్ బెయిల్ మంజూరు.. -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..!












Click it and Unblock the Notifications