‘బాబు గారూ! మీ మనసు నొప్పించివుంటే మన్నించండి!! ’
తనను మన్నించాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ధర్మవరంలో తలెత్తిన వివాద విషయమై ఈ మేరకు స్పందించారు ఎమ్మెల్యే సూర్యనారాయణ.
అనంతపురం: తనను మన్నించాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ధర్మవరంలో తలెత్తిన వివాద విషయమై ఈ మేరకు స్పందించారు ఎమ్మెల్యే సూర్యనారాయణ.
తాను సీఎం చంద్రబాబునాయుడి మనసు నొప్పించి ఉంటే మన్నించాలని ఎమ్మెల్యే సూర్యనారాయణ కోరారు. అసలు విషయంలోకి వెళితే.. ధర్మవరంలో విద్యుత్ కేబుల్ లాగే విషయంలో మంత్రి పరిటాల, సూరి వర్గీయుల మధ్య మొదలైన వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది.
తమ అనుచరులను అన్యాయంగా కొట్టారంటూ ఎమ్మెల్యే.. శనివారం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి వినతిపత్రం అందించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతరు చేయడం వల్లనే సమస్య వచ్చిందన్నారు ఎమ్మెల్యే సూర్యనారాయణ. తమ కార్యకర్తలకు గాయాలు కావడం చూసి తట్టుకోలేకే తాను స్పందించానని.. ఈ విషయంలో అధినేత మనసు నొప్పించి ఉంటే మన్నించాలని విజ్ఞప్తి చేశారు.