టి నోట్: సమరమేనని రాయపాటి, హర్షణీయమని హరీష్
రాత్రికి రాత్రే కేబినెట్ నోట్ సిద్ధమైనట్లుగా తెలుస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ నోట్ వెనుక కొందరు రాష్ట్ర నేతల హస్తం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. తమకు పార్టీ కంటే ప్రజలు ముఖ్యమని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. పార్టీ బరితెగిస్తే అందరు రాజీనామాలు చేయాలని, అంతర్గత రాజకీయాలు మానాలని హితవు పలికారు.
స్వాగతించిన తెలంగాణ నేతలు
కేబినెట్ నోట్ హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావులు అన్నారు. హైదరాబాదు పైన ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణను స్వాగతిస్తామన్నారు. కేబినెట్ నోట్ స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
సీమాంధ్రులు ఇప్పటికైనా ఉద్యమాన్ని విరమించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందామన్నారు. చర్చల ద్వారా సీమాంధ్రుల అపోహలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
టిజిని కలిసిన గంటా, లగడపాటి
కేబినెట్ నోట్ సిద్ధం వార్తల నేపథ్యంలో మంత్రి టిజి వెంకటేష్ను మంత్రి గంటా శ్రీనివాస రావు, ఎంపి లగడపాటి రాజగోపాల్లు కలిశారు.