నారా లోకేష్ కాళ్లు పట్టుకున్న కార్యకర్త: ఎందుకో?
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాళ్లు పట్టుకున్నాడు ఓ కార్యకర్త.
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాళ్లు పట్టుకున్నాడు ఓ కార్యకర్త. మంగళవారం నాడు పార్టీ వర్క్ షాప్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ కార్యకర్త లోకేష్ కోసం చాలాసేపు వేచి చూశాడు.
అంతలో లోకేష్ అటుగా వచ్చారు. ఆయన రాగానే ఆ కార్యకర్త కాళ్ల మీద పడ్డారు. ఈ సన్నివేశం మీడియా కంట్లో పడింది. అయితే ఆ కార్యకర్త మర్యాద కోసం లోకేష్ కాళ్లు పట్టుకున్నారా లేక ఇంకేమైనా సమస్య కోసం పట్టుకున్నారా తెలియాల్సి ఉంది.

కాగా, పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను ప్రతి నియోజకవర్గానికి వంద మందిని సూచించాలని ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంచార్జులకు లోకేష్ సూచించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఏటా రూ.20 కోట్ల వరకు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 2018 నుంచి కార్యకర్తలకు సహజ మరణాలకు కూడా బీమా వర్తింపజేసేలా ప్రయత్నిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications