బిజెపి, టిడిపి పొత్తు: టి బిజెపి ఆఫీసులో గందరగోళం

పొత్తులతో సంబంధం లేకుండా సూర్యాపేట టిక్కెట్ను సంకినేని వెంకటేశ్వరావుకి ఇవ్వాలంటూ నల్గొండ జిల్లా సూర్యపేటకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట్ నుంచి రతన్ బాలరెడ్డికి చెందిన కార్యకర్తలు కూడా కార్యాలయంలో నినాదాలు చేశారు.
రతన్ బాలరెడ్డికి టికెట్ రాకుండా బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు.
పార్టీ కోసం పనిచేసిన వారికే నారాయణపేట్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన నాగం జనార్ధన్ రెడ్డిని కార్యకర్తలు నిలదీశారు. తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని కోరారు.
ఇరువర్గాల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు పొత్తులతో సంబంధం లేకుండా నామినేషన్లు వేయాలని మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, టిడిపి అధినేత చంద్రబాబుతో బిజెపి జాతీయ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ పొత్తులపై చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications