చంద్రబాబునాయుడు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రయివేట్ లిమిటెడ్??
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించే తరుణంలో ఒక ఆర్థికవేత్తలా వ్యవహరించేవారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందివ్వడం వారి భవిష్యత్తుకు, దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదనే భావనలో ఉండేవారు. అందుకే ఆయన పరిపాలనలో తెచ్చుకున్నంత పేరును పార్టీపరంగా తెచ్చుకోలేకపోయారు. బహుశా ఆయన ఎంఏలో ఎకనామిక్స్ చదివారు కాబట్టి ఆర్థిక వ్యవస్థపై గట్టి పట్టుండటంవల్ల సంక్షేమ పథకాల రూపకల్పనకు చాలా దూరంగా ఉండేవారు.
Recommended Video
సంక్షేమంలో వెనకబడ్డారు!
కానీ
1983లో
అధికారం
చేపట్టిన
ఎన్టీ
రామారావులా,
2004లో
అధికారం
చేపట్టిన
దివంగత
వైఎస్
రాజశేఖర్రెడ్డిలా,
2014లో
ముఖ్యమంత్రి
అయిన
కేసీఆర్లా,
2019లో
సీఎం
అయిన
వైఎస్
జగన్మోహన్రెడ్డిలా
సంక్షేమ
పథకాలను
ప్రజలకు
అందించడంలో
వెనకబడ్డారు.
2019
ఎన్నికల
చివరలో
కొన్ని
ప్రకటించినప్పటికీ
అప్పటికే
చేయి
దాటిపోయింది.
తాజాగా
కుప్పం
పర్యటనలో
చంద్రబాబు
చేసిన
ప్రకటన
ఆ
పార్టీ
శ్రేణులను
ఆనందపరిచింది.
కొత్త సంక్షేమ పథకాలతో మీ ముందుకొస్తా?
తాను అధికారంలోకి వస్తే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేయడంతోపాటు కొత్త సంక్షేమ పథకాలతో మీ ముందుకు వస్తానని ప్రకటించారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకన్నా మిన్నగా ఉండేలా సరికొత్త పథకాలను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధిపై ఎక్కువగా దృష్టిసారించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపచేయడంతోపాటు సంక్షేమ పథకాలపై కూడా దృష్టి సారించాలని, లేదంటే పార్టీకి భవిష్యత్తు ఉండదని చంద్రబాబు గ్రహించారు.
కొత్త పథకాలకు రూపకల్పన
ప్రస్తుతం
వైఎస్
జగన్
అమలు
చేస్తోన్న
సంక్షేమ
పథకాలకన్నా
మిన్నగా
కొత్త
పథకాల
రూపకల్పనకు
శ్రీకారం
చుట్టారు.
దీనికోసం
ప్రత్యేకంగా
ఒక
టీమ్ను
ఏర్పాటు
చేశారు.
రాష్ట్ర
ఆర్థిక
వ్యవస్థను
కూడా
దృష్టిలో
ఉంచుకొని
మెరుగైన
పథకాలను
ఈ
టీమ్
రూపొందిస్తోంది.
సమర్థవంతమైన
నేతగా,
పరిపాలకుడిగా
పేరున్న
బాబు
సంక్షేమం
విషయంలో
వెనకబడ్డారు.
ఎన్టీఆర్,
వైఎస్,
జగన్లా
పేరు
తెచ్చుకోలేకపోయారు.
ఇప్పుడు
వారిని
మించి
పేరు
తెచ్చుకునేలా
పథకాలకు
రూపకల్పన
చేయబోతున్నారు.
సంక్షేమ
పథకాలను
అందించడంలో
తెలుగుదేశం
పార్టీ
కూడా
ముందంజలో
ఉంటుందని
నిరూపించడానికి
బాబు
కంకణబద్ధులైనట్లు
స్పష్టమవుతోంది.