'సింహం లాంటోన్ని జీరో చేస్తున్నారు.. టీడీపీ మిత్రులు టూ డేంజర్'
పార్టీ పదవులు తీసుకున్నవారు విజిటింగ్ కార్డులు ముద్రించుకుని అమరావతిలో సెటిల్మెంట్లు చేసుకుంటున్నవారే ఎక్కువగా ఉన్నారని అన్నారు.
గుంటూరు: వందమంది శత్రువుల కన్నా.. ఒక్క వెన్నుపోటు పొడిచే మిత్రుడితోనే అత్యంత ప్రమాదమనేది నానుడి. సరిగ్గా తన విషయంలోను ఇలాగే జరుగుతోందంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.
రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో సింహంలా పనిచేసిన తనను అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్నవారే జీరో చేయాలని చూస్తున్నారని మోదుగుల ఆవేదన వ్యక్తం చేశారు. బయట ఉన్న శత్రువుల కన్నా.. టీడీపీలో ఉన్న మిత్రులతోనే ఎక్కువ నష్టమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

గుంటూరులో జరిగిన టీడీపీ నగర సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మోదుగుల ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఇతరుల జోక్యం ఎక్కువైపోయిందని, దీనివల్ల పార్టీ పదవులు, పనులు తన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయని అన్నారు.
పార్టీ కార్యకర్తల కోసం, పేదల కోసం ఏవైనా సిఫారసులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటిపోయినా.. నగరపాలక సంస్థ ఎన్నికలు మాత్రం జరగలేదన్నారు. వక్ఫ్ బోర్డు, దేవస్థాన కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నారని చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications