నెల్లూరు గడ్డపై వైసీపీకి భారీ జలక్, నెక్స్ట్ ఎవరు..!!
నెల్లూరు కేంద్రంగా రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా కంచుకోటగా ఉంది. 2019 జిల్లాలోని అన్ని సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా.. 2024 లో సీన్ రివర్స్ అయింది. అన్ని సీట్లు కూటమి గెలుచుకుంది. ఇక.. సీనియర్ల నేతలకు అడ్డగా నిలిచిన నెల్లూరులో వైసీపీకి మరో భారీ జలక్ ఇచ్చేందుకు టీడీపీ సర్వం సిద్దం చేసింది. ఇందుకు ముహూర్తం ఖరారు అయింది. ఇక... నెక్స్ట్ జరిగే పరిణామాల పై ఉత్కంఠ కొనసాగుతోంది.
నెల్లూరులో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. నెల్లూరు 2024 ఎన్నికల్లో అన్ని సీట్లకు టీడీపీ అభ్యర్ధులే గెలుపొందారు. ఆ ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన నేతలు ఎమ్మెల్యే లు అయ్యారు. ఆనం మంత్రిగా కొనసాగుతున్నారు. నెల్లూరు సిటీ కేంద్రంగా ఇప్పుడు కొత్త వ్యూహా లు అమలు చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మెజార్టీ కార్పోరేషన్లు, మున్సి పాలిటీల్లో వైసీపీ ప్రజా ప్రతినిధులు కూటమి పార్టీల్లోకి చేరారు. ఫలితంగా పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం చేసుకుంది. ఇక.. ఇప్పుడు నెల్లూరు కార్పోరేషన్ పైన కూటమి ఫోకస్ చేసింది. టీడీపీ మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఎమ్మెల్యే కోటం రెడ్డి స్కెచ్ సిద్దం చేసారు. ఫలితంగా మరో కార్పోరేషన్ టీడీపీ ఖాతాలో పడటం లాంఛనంగా కనిపిస్తోంది.

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రెండు నియోజకవర్గాలు ఉండగా మొత్తం 56 డివిజన్లు ఉన్నాయి. సిటీ, రూరల్ నియోజకవర్గాల నుంచి టీడీపీ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఉండగా.. ఇద్దరు ఎంపీలు ఉన్నారు. 56 డివిజన్లలో ప్రస్తుతం 29 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో 56 డివిజన్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా, అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఆ తర్వాత టీడీపీలోకి భారీగా కార్పోరేటర్లు వలస వచ్చారు . డిప్యూటీ మేయర్ రూప్కుమార్తోపాటు మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరినా మేయర్ మాత్రం వైసీపీలో ఉండటంతో సాంకేతికంగా ఈ కార్పొరేషన్ ప్రస్తుతానికి వైసీపీ ఖాతాలో ఉంది. కాగా, మంత్రి నారాయణ.. ఎమ్మెల్యే కోటంరెడ్డి తాజాగా కార్పోరేటర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మేయర్ పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి కావటంతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం కార్పోరేషన్ లో టీడీపీకి 43 మంది, వైసీపీకి 14 ఓట్లు ఉన్నాయి. రేపు మరోసారి కార్పోరేటర్లతో సమావేశం తరువాత మేయర్ పైన అవిశ్వాసానికి రంగం సిద్దం చేస్తున్నారు.
-
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications