Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ జగన్ పై రాయి విసిరింది అతడేనా ?

ఏపీలో ఎన్నికల వేళ సీఎం వైఎస్ జగన్ పై విజయవాడలో జరిగిన రాయి దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో బస్సు యాత్ర చేస్తున్న జగన్ పై పదునైన రాయి విసరడం భద్రతా లోపాల్ని బయటపెట్టింది. హైటెన్షన్ వైర్లు తగులుతాయన్న కారణంతో జగన్ బస్సు యాత్ర జరుగుతున్న ప్రాంతంలో కరెంటు నిలివేయడం, అదే అదనుగా ఆగంతకులు రాయి విసరడం, జగన్ గాయం పాలవ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అసలు రాయి విసిరింది ఎవరన్న దానిపై స్ధానికంగా ఓ ప్రచారం జరుగుతోంది.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా ఆయనపై రాయి దాడి జరిగింది. దీనికి స్ధానికంగా ఉండే ఓ రౌడీ షీటర్ కారణమన్న ప్రచారం జరుగుతోంది. వంకా శ్రీను అనే రౌడీ షీటరే ఈ దాడికి పాల్పడినట్లు సెంట్రల్ సీటులో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పై దాడికి వైసీపీ నేతలు కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ సూత్రధారులని బోండా ఆరోపించారు.

tdp leader bonda uma reveals who pelted stone on ys jagan
తాను పోటీ చేస్తున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముందస్తు ప్రణాళికతో సీఎంపై దాడి చేయించారని బోండా ఉమ ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రౌడీ షీటర్ల తో ఈ దాడి చేయించారన్నారు. సీఎం పై దాడి కుట్ర లో కేశినేని నాని, వెల్లంపల్లి సూత్రధారులని, ఈ ఇద్దరి కాల్ డేటాను బయటకు తీయాలన్నారు. వంకా శ్రీను అనే రౌడీ షీటర్ తో ఈ పని చేయించినట్లు తమకు సమాచారం ఉందన్నారు.

సానుభూతి కోసం చంద్రబాబుపై,ఇక్కడ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనపై నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీఎంపై దాడి కేసు విచారణ సీబీఐకి ఇవ్వాలన్నారు. సీబీఐ విచారణ జరపాలని సాయంత్రం గవర్నర్ ను కలుస్తున్నట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+