ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే..! బుద్దా వెంకన్న జోస్యం..
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓట్ల శాతం కూడా తేలిపోయింది. తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో 81.76 శాతం పోలింగ్ నమోదైనట్లు ఇవాళ ఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈసారి గెలుపు ఎవరిదన్న అంశంపై రాష్ట్రంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇందులో కొందరు వైసీపీకి తిరిగి అధికారం లభిస్తుందని, మరికొందరు లేదు ఎన్డీయే కూటమి కచ్చితంగా గెలుస్తుందని విశ్లేషణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తన జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 130 సీట్లకుపైగా గెలువబోతోందని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. పోలింగ్ రోజు అర్ధరాత్రి వరకు ఓటర్లు బారులు తీరడమే దీనికి ఉదాహరణ అన్నారు. ప్రభుత్వంపై ఉన్న కక్షతోనే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఓటు వేశారన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు అవసరమని ప్రజలు గుర్తించారని బుద్ధా తెలిపారు. చంద్రబాబు నాలుగోసారి సీఎంగా అమరావతిలో ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన వెల్లడించారు.

వైసీపీ ని ఓడించేందుకు నారా కుటుంబం రోడ్డుపైకి వచ్చిందని బుద్ధా వెంకన్న తెలిపారు. మంత్రి బొత్స సతీమణి ఝాన్సీ కూడా ఎంపీగా ఓడిపోతున్నారని ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న బుద్ధా వెల్లడించారు. ఫలితాలు వచ్చేలోపు అధికారులను భయపెట్టాలని మంత్రి బొత్స మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే పోలింగ్ పూర్తయిందని, ఇలాంటి వ్యాఖ్యల వల్ల మారేదేమీ లేదన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications