వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సాక్షి గంజాయి మొక్క: సిఎం రమేష్ వ్యాఖ్య

|
Google Oneindia TeluguNews

 CM Ramesh
హైదరాబాద్: తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, అతనికి సంబంధించిన పత్రిక, ఛానల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తులసి వనం లాంటి భారతీయ జర్నలిజంలో జగన్ పత్రిక, ఛానల్ గంజాయి మొక్కల్లా మారాయని ఆయన ధ్వజమెత్తారు. ఈ విష వృక్షాలు వాటి అవినీతి బీజాలను వాడవాడలా వాప్తి చేస్తూ సమాజాన్ని కలుషితం చేస్తున్నాయని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే ఈ పత్రికను స్థాపించినట్లు ఆనాటి ముఖ్యమంత్రి, దిగవంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆ పత్రికను తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది జూన్ 12 నుంచి బహిష్కరించినట్లు ఆయన చెప్పారు. తమ పార్టీ బహిష్కరించినప్పటికీ తమ వార్తలు ప్రచురిస్తూ..వారి విలేకరి వస్తే ఈ ప్రశ్నలు అడిగేవారంటూ.. చరిత్రలోనే లేని మురికి విధానాన్ని ప్రవేశ పెట్టారని రమేష్ విమర్శించారు.

'జగన్‌కోసం' అంటూ బినామీ పేర్లతో పద్దులు పుచ్చుకుని అద్దె కలాలతో కథనాలు రాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకులపై లేనిపోని కట్టు కథలతో అసభ్య ప్రచారానికి శ్రీకారం చుట్టారని ఆయన విమర్శించారు.

ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కొనుగోళ్లకు ఓబీ వ్యానులను వినియోగించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. బినామీల అవినీతి పుత్రిక వైయస్ జగన్ పత్రిక అని ఆయన ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనే ఏకైక ఎజెండాతో పనిచేస్తున్న ఆ పత్రిక, ఛానల్ జర్నలిజం వ్యవస్థకే తీరని కళంకమని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

English summary
Telugudesam Party Parliment member CM Ramesh fired at YSR Party President YS Jaganmohan Reddy and his Media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X