'వ్యూహంతోనే తుని ఘటన, కాపులు తలదించుకునేలా': జగన్ వైపు వేలు
విజయవాడ: తుని ఘటన పైన మంత్రి నారాయణ ఘాటుగా స్పందించారు. మందస్తు వ్యూహంతోనే తుని విధ్వంసం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని ఆయన వైసిపి అధ్యక్షులు జగన్ పైన పరోక్షంగా మండిపడ్డారు.
బీసీలను కాపులలో చేర్చే విషయమై తాము కట్టుబడి ఉన్నామని మంత్రి నారాయణ చెప్పారు. కొందరు కాపు నేతలు కాపులు మొత్తం తలదించుకునేలా చేశారని మండిపడ్డారు. తుని ఘటన పైన టిడిపి నేతలు వైయస్ జగన్ వైపు వేలు చూపిస్తున్న విషయం తెలిసిందే.

తుని అల్లర్లకు కారణం చంద్రబాబే!: విశాఖలో సి.రామచంద్రయ్య ప్రకటన
తునిలో ఆదివారం చోటుచేసుకున్న అల్లర్లకు టిడిపి అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే కారణమని ఏపీ శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత, కాపు సామాజికవర్గానికి చెందిన కీలక నేత సి రామచంద్రయ్య ఆరోపించారు.
ఆయన సోమవారం నాడు విశాఖలో విలేకరులతో మాట్లాడారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల నాడు హామీ ఇచ్చిన చంద్రబాబు, గద్దెనెక్కిన తర్వాత ఆ విషయాన్ని పక్కన బెట్టేశారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఉదాసీన వైఖరి కారణంగానే నిన్నటి కాపు గర్జనలో కాపులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారన్నారు. కాపుల హింసాకాండకు ముమ్మాటికీ చంద్రబాబుదే బాధ్యత వహించాలన్నారు. నిర్ణీత గడువులోగా కాపులను బీసీల్లో చేర్చి ఉంటే నిన్నటి ఘటన చోటుచేసుకునేది కాదన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications