టీడీపీ ఎమ్మెల్యేల సస్పెండ్...
అసెంబ్లీ సమావేశాల నుండి టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరోజు పాటు సస్పెండ్ అయ్యారు. రాజధాని అమరావతిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్న సంధర్భంలో గందరగోళం సృష్టించడంతో నేరుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
రాజధానిపై నిజాలను ప్రజలకు తెలియకుండా టీడీపీ అందోళన చేస్తుందని, అందుకే అసెంబ్లీని అడ్డుకునేందుకే ఘర్షణ వాతవరణం సృష్టిస్తుందని అన్నారు. ఆ వెంటనే వారిని సస్పెండ్ చేయాలని కోరతూ... తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. దీంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు.
కాగా సస్పెండ్ అయిన టీడీపీ సభ్యుల్లో , అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్, అనగాని సత్యప్రసాద్, వెళగపూడి రామకృష్ణబాబు, గద్దె రామ్మోహన్ ,ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయ స్వామి, మద్దెల గిరిలు ఉన్నారు. ఈనేపథ్యంలోనే సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉందని , అయితే వారు సభను అడ్డకోవడం దురదృష్టకరమమని సస్పెండ్ చేసిన సమయంలో స్పీకర్ వ్యాఖ్యానించారు.