వివేకా కేసు కోల్డ్ స్టోరేజ్ లోకే..! భారీ కుట్ర..! సుప్రీం నిర్ణయం వేళ బీటెక్ రవి షాకింగ్ ..!
ఏపీలో ఆరేళ్లుగా సంచలనాత్మకంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిన్న సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో వైసీపీ హయాంలో వివేకా హత్యకు ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డే కారణమని, వారిని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కాపాడుతున్నారంటూ ఈ ముగ్గురిపైనా పోలీసులు నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో పాటు ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా సీబీఐ చెప్పాలని ఆదేశించింది.
దీనిపై ఇవాళ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీతకు గట్టి మద్దతుదారుగా ఉన్న బీటెక్ రవి నిన్న సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న పరిణామాలతో వివేకా కేసు మరోసారి కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిందా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఈ కేసుపై ఎలాంటి పురోగతి లేకపోవడంపై ప్రజాస్వామ్యవాదులు, అహింసావాదులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. నిర్ధ్యాక్షిణ్యంగా వివేకానందరెడ్డిని చంపినప్పటికి ఈ కేసును ఎందుకు తేల్చడంలేదనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఈ కేసును త్వరగా తేల్చాలని అభ్యర్థిస్తున్నారని గుర్తుచేశారు.

వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు కాల పరిమితి విధించినందునే సీబీఐ ఎంక్వైరీ ఆగిపోయిందని సునీత లాయర్ సిద్ధార్థ లూద్రా చెబుతున్నారని, సుప్రీం కోర్టు కాలపరిమితిని సడలిస్తే ఎంక్వైరీ సజావుగా జరిగేందుకు అవకాశముందని అంటున్నారని గుర్తుచేశారు. కాబట్టి సుప్రీంకోర్టు ఈ గడువును సడలించాలన్నారు. ఈ హత్య కేసులోని ముద్దాయిలు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని, సాక్ష్యులను బెదిరించడం, కేసు విషయంలో ప్రభావితం చేయడం చేస్తున్నారని ఆరోపించారు.

అయినా సునీత న్యాయపోరాటం చేస్తున్నారని, నిందితులు బయట తిరగడంతో ఈ కేసు పురోగతికి అడ్డంకిగా మారుతోందని బీటెక్ రవి ఆరోపించారు. వివేకా హత్య కేసు ముద్దాయిల బెయిల్ ను రద్దు చేయాలని సునీత కోరారన్నారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ కేసుకు కాలపరిమితి విధించడంతో సీబీఐ ఈ కేసు అయిపోయిందని మూసేసిందన్నారు. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు సీబీఐకి సూచించాలని ఆయన కోరారు. సునీత లాయర్ లూద్రా కూడా ఇదే అడుగుతున్నారన్నారు. సుప్రీం కోర్టు సీబీఐకి సూచిస్తే తప్ప వారు ఈ కేసును చేపట్టరన్నారు. ఇందులో భారీ కుట్ర ఉందన్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications