Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ వైపు మరో టీడీపీ ఎంపీ చూపు - ఆ వర్గం నేతలపై గురి..!!

ఏపీలో ఎన్నికల వేళ జంపింగ్స్ మొదలయ్యాయి. వైసీపీలో టికెట్లు దక్కని వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. దీనికి వైసీపీ కౌంటర్ గేమ్ ప్రారంభించింది. టీడీపీ సిట్టింగ్ ఎంపీలు.. ఆ పార్టీకి ప్రధానంగా అండగా నిలిచే సామాజిక వర్గ నేతలను ట్రాప్ చేస్తోంది. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాలకు దూరం అవుతన్నారని భావిస్తున్న వేళ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తో వైసీపీ నేతల భేటీతో ఇప్పుడు ఆసక్తి కర చర్చ మొదలైంది.

Recommended Video

    TDP కీలక నేతలకు గురి పెడుతున్న YCP | AP News | Telugu Oneindia

    పార్టీల జంపింగ్స్: ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నుంచి జంపింగ్స్ పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ ఇంఛార్జ్ లను అవసరమైన నియోజకవర్గాల్లో మారుస్తున్నారు. దాదాపు 60 నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులకు నిర్ణయించారు. ఈ క్రమంలో మూడో జాబితా ఈ రోజు ప్రకటించనున్నారు. అటు టీడీపీ నుంచి వైసీపీలో వలసలు మొదలయ్యాయి.

    TDP MP Galla Jayadev meets YSRCP leaders leads to new Speculations in Chittoor District

    టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో..ప్రధానంగా అండగా నిలుస్తున్న సామాజిక వర్గానికి చెందిన నేతల పైన వైసీపీ గురి పెట్టింది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసారు. సీఎం జగన్ ను కలిసారు. తన రాజీనామా ఆమోదం పొందగానే వైసీపీలో చేరుతానని ప్రకటించారు. చంద్రబాబు పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

    వైసీపీ నేతలతో భేటీ: ఇది విజయవాడ రాజకీయాల్లో ఎన్నికల వేళ అనూహ్య మలుపుగా మారుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచనలంగా మారాయి. ఇదే సమయంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వైసీపీకి చెందిన ముఖ్య నేత చెవిరెడ్డితో సమావేశమయ్యారని..పార్టీ మార్పు దిశగా చర్చ జరుగుతోందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నాయి.

    దీని పైన రెండు వైపులా ఎలాంటి అధికారిక స్పందన ఇప్పటి వరకు లేదు. గుంటూరు నుంచి 2014,2019 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా గెలిచిన జయదేవ్ కొంత కాలంగా నియోజకవర్గానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తాజాగా తెలంగాణలో తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో బిజీగా ఉంటున్నారు. పార్లమెంట్ సమావేశాలకు మాత్రం హాజరవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జయదేవ్ పోటీ చేయటం లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

    TDP MP Galla Jayadev meets YSRCP leaders leads to new Speculations in Chittoor District

    టీడీపీని వీడుతున్నారా: జయదేవ్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారని..సంక్రాంతి తరువాత మద్దతు దారులతో సమావేశం ఏర్పాటు చేసి అక్కడే తన నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ సమయంలో ఈ భేటీ గురించి చర్చ మొదలైంది.గల్లా జయదేవ్ తాజాగా వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డితో భేటీ అయ్యారని తెలుస్తోంది. గల్లా కుటుంబానిది చంద్రగిరి సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి చెందిన చెవిరెడ్డితో జయదేవ్ భేటీ వెను అంతర్యం ఏంటనేది ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది.

    ఇదే సమయంలో ఒకటి, రెండు రోజుల్లో జయదేవ్ సీఎం జగన్ తో సమావేశం కానున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీంతో టీడీపీకి చెందిన ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుందనే వాదన వినిపిస్తోంది. దీంతో..జయదేవ్ రాజకీయంగా తన నిర్ణయం మార్చుకుంటారా లేదా రాజకీయాలకే దూరంగా ఉంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+