టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలనం-షిండేలా సీఎం రమేష్-అధికారం కష్టమే-ఇంట్రస్ట్ లేదు
కొంతకాలంగా టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా కనిపిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా అధినేత చంద్రబాబుతో పాటు ఆయన చుట్టూ ఉన్నకోటరీపై కేశినేని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.ఇదే క్రమంలో ఇవాళ ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడిన కే్శినేని మరోసారి సంచలనం రేపారు.
టీడీపీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇవాళ ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడిన కేశినేని నాని.. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ఎపిసోడ్ తో వాటిని పోల్చారు. మహారాష్ట్ర లో ఏక్ నాథ్ షిండేలా టీడీపీలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నాడంటూ కేశినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 50, 60 సీట్లు టీడీపీకి వస్తే ఏక్ నాథ్ షిండే లా సీఎం రమేష్ తో ఆపరేషన్ చేస్తారంటూ మరో సంచలనం రేపారు.

అంతటితో ఆగకుండా కేశినేని నాని మరిన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారంలోకి రాదని ఆయన వ్యాఖ్యానించారు. గెలిచే శక్తి, యుక్తి చంద్రబాబుకు లేదన్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళ మాటలు చంద్రబాబు నమ్మరని కేశినేని వ్యాఖ్యానించారు. బ్రోకర్లు, లోఫర్ల మాటలే చంద్రబాబు వింటారని విజయవాడ ఎంపీ తెలిపారు. నాకు రాజకీయాల్లో కొనసాగాలనే ఇంట్రస్ట్ లేదన్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications