టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలనం-షిండేలా సీఎం రమేష్-అధికారం కష్టమే-ఇంట్రస్ట్ లేదు
కొంతకాలంగా టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా కనిపిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా అధినేత చంద్రబాబుతో పాటు ఆయన చుట్టూ ఉన్నకోటరీపై కేశినేని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.ఇదే క్రమంలో ఇవాళ ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడిన కే్శినేని మరోసారి సంచలనం రేపారు.
టీడీపీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇవాళ ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడిన కేశినేని నాని.. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ఎపిసోడ్ తో వాటిని పోల్చారు. మహారాష్ట్ర లో ఏక్ నాథ్ షిండేలా టీడీపీలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నాడంటూ కేశినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 50, 60 సీట్లు టీడీపీకి వస్తే ఏక్ నాథ్ షిండే లా సీఎం రమేష్ తో ఆపరేషన్ చేస్తారంటూ మరో సంచలనం రేపారు.

అంతటితో ఆగకుండా కేశినేని నాని మరిన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారంలోకి రాదని ఆయన వ్యాఖ్యానించారు. గెలిచే శక్తి, యుక్తి చంద్రబాబుకు లేదన్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళ మాటలు చంద్రబాబు నమ్మరని కేశినేని వ్యాఖ్యానించారు. బ్రోకర్లు, లోఫర్ల మాటలే చంద్రబాబు వింటారని విజయవాడ ఎంపీ తెలిపారు. నాకు రాజకీయాల్లో కొనసాగాలనే ఇంట్రస్ట్ లేదన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications