ఢిల్లీ నుంచి రాష్ట్రానికి... తిరుగుముఖం పట్టిన టిడిపి ఎంపీలు
పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినప్పటికి గత రెండు రోజులుగా డిల్లీలోనే ఉండి వివిధ రకాలుగా ఆందోళనలు చేసిన టిడిపి ఎంపీలు తమ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు తిరిగి రాష్ట్రానికి బయలుదేరినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తమ పార్టీ ఎంపీల పోరాటంపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు టిడిపి ఎంపీల అందోళన జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిందని ప్రశంసించారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈరోజు రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి ప్రతిజ్ఞ చేసిన టిడిపి ఎంపీలు రాష్ట్రానికి తిరుగు ప్రయాణమైనట్లు తెలిసింది. రాష్ట్రానికి తిరిగి వచ్చిన అనంతరం టిడిపి ఎంపీలు తమ పోరాట వేదికను ఢిల్లీ నుంచి ఎపి గల్లీలకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా టిడిపి చేపట్టనున్న బస్సు యాత్రలో ఎంపీలు రాష్ట్రమంతా పర్యటిస్తారని తెలిసింది. అనంతరం పోరాట పంథాలను విస్తృతపరిచే విషయమై తమ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ కార్యకర్తలు, ప్రజలతో సమావేశమై చర్చించి ఆ ప్రకారం ఆందోళన చేయాలని నిర్ణయించారట.

అయితే పోరాట పంథా ఏదైనా తమ నియోజకవర్గాలల్లో సభలు పెట్టి ఎపికి బిజెపి ఎపికి చేసిన అన్యాయం, అలాగే ప్రజల కోసం ఎపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, తదితర విషయాలు వివరించడం ఖాయమని తెలుస్తోంది. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలకు ఇప్పటికే దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications