ఢిల్లీ నుంచి రాష్ట్రానికి... తిరుగుముఖం పట్టిన టిడిపి ఎంపీలు
పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినప్పటికి గత రెండు రోజులుగా డిల్లీలోనే ఉండి వివిధ రకాలుగా ఆందోళనలు చేసిన టిడిపి ఎంపీలు తమ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు తిరిగి రాష్ట్రానికి బయలుదేరినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తమ పార్టీ ఎంపీల పోరాటంపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు టిడిపి ఎంపీల అందోళన జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిందని ప్రశంసించారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈరోజు రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి ప్రతిజ్ఞ చేసిన టిడిపి ఎంపీలు రాష్ట్రానికి తిరుగు ప్రయాణమైనట్లు తెలిసింది. రాష్ట్రానికి తిరిగి వచ్చిన అనంతరం టిడిపి ఎంపీలు తమ పోరాట వేదికను ఢిల్లీ నుంచి ఎపి గల్లీలకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా టిడిపి చేపట్టనున్న బస్సు యాత్రలో ఎంపీలు రాష్ట్రమంతా పర్యటిస్తారని తెలిసింది. అనంతరం పోరాట పంథాలను విస్తృతపరిచే విషయమై తమ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ కార్యకర్తలు, ప్రజలతో సమావేశమై చర్చించి ఆ ప్రకారం ఆందోళన చేయాలని నిర్ణయించారట.

అయితే పోరాట పంథా ఏదైనా తమ నియోజకవర్గాలల్లో సభలు పెట్టి ఎపికి బిజెపి ఎపికి చేసిన అన్యాయం, అలాగే ప్రజల కోసం ఎపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, తదితర విషయాలు వివరించడం ఖాయమని తెలుస్తోంది. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలకు ఇప్పటికే దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications