టీడీపీ ఎంపీలపై స్పీకర్ ఆగ్రహం, లోకసభ వాయిదా, ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఏపీ ఎంపీల నిరసన కొనసాగుతోంది. శుక్రవారం లోకసభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే వాయిదా పడింది. ఏపీ టీడీపీ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు.
Recommended Video

ఆందోళనరు విరమించాలని స్పీకర్ పదేపదే ఎంపీలను కోరారు. ప్రతిరోజు ఇలా సరికాదని అసహనం వ్యక్తం చేశారు. కానీ వారు మాత్రం పట్టు వీడలేదు. ఎంపీ శివప్రసాద్ మరోసారి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అమ్మవారి షిగం ఊగుతూ నిరసన తెలిపారు. టీడీపీ, వైసీపీ ఎంపీల వద్దకు జైరాం రమేష్ వచ్చి వెళ్లారు.

ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ.. మోడీ ప్రజలను మోసం చేయడమే కాకుండా తిరుపతి వెంకన్న సాక్షిగా కూడా మోసం చేశారని శివప్రసాద్ అన్నారు. కనకదుర్గమ్మను కూడా మోసం చేశారన్నారు. తిరుపతిలో మోడీ అనేక హామీలు ఇచ్చి మర్చిపోయారన్నారు. తనలో వెంకన్న పూనాడని, మోడీని హెచ్చరించమన్నాడని చెప్పారు.

వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఏపీకి హామీ ఇచ్చిన ప్రధాని మోడీ దానిని నెరవేర్చాలన్నారు. ఎంపీల నిరసన నేపథ్యంలో సభ తొలుత మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా పడింది. రాజ్యసభలోను అదే పరిస్థితి కావడంతో అదీ వాయిదా పడింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications