జేఏసీ ముసుగులో వైసీపీ-సీమ ప్రజలూ అలర్ట్ -టీడీపీ మాజీ మంత్రి కాల్వశ్రీనివాసులు
ప్రాంతీయ చిచ్చుతో చలికాచుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకుల పన్నాగాలను ప్రజలు గ్రహించాలని టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ వికృత రాజకీయ క్రీడలకు అంతులేకుండాపోతోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకొమ్మని, అత్యంత వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు పెద్దపీట వేయమని ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెబితే... ఈ మూడున్నర సంవత్సరాలుగా ఎక్కడా అభివృద్ది కార్యక్రమాలు చేయలేదని కాల్వ ఆరోపించారు. టీడీపీ సర్కార్ ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోయాయన్నారు.
ఉత్తరాంధ్రలో వైసీపీ విభజన రాజకీయాలు చేస్తోందని, అధికారంలో ఉండేవారే ఆందోళనలు చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అధికారంలో ఉండేవారే ఆందోళన చేయడమంటే దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లు అవుతుందన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించమని అధికారాలు, అవకాశమిస్తే ఆ అవకాశాలను స్వార్థానికి మార్చుకున్నారన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అధికారంలో ఉండి రాయలసీమకు అన్యాయం జరిగిందని ర్యాలీ చేయడం, ఆక్రోశాన్ని వెళ్లగక్కడం సరికాదన్నారు. 1937లో శ్రీ బాగ్ ఒడంబడిక అమలు జరగడంలేదని గగ్గోలు పెడుతున్నారని, ఈ ఒప్పందంలోని అంశాలను అమలు చేయొద్దని ఎవరూ అనలేదన్నారు. ఎవరు అభివృద్ధి నిరోధకులుగా మారారో ప్రజలు గ్రహిస్తున్నారన్నారు.

టీడీపీ హయాంలో రాయలసీమకు న్యాయం చేశామని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి రాయలసీమను అభివృద్ధి చేయొద్దని ఎవరూ చెప్పలేదని కాల్వ తెలిపారు. సామాజిక పెద్దలే ప్రభుత్వ స్థానాల్లో ఉండి రాయలసీమ పట్ల హీనంగా వ్యవహించారని విమర్శించారు. అధికారం వైసీపీ చేతుల్లోనే ఉందని, అభివృద్ధి చేయాల్సింది వారేనని కాల్వ తెలిపారు. దాన్ని విస్మరించి కొత్తగా ప్రాంతీయ విబేధాలు, విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. మేధావుల ముసుగులో జగన్ జీతగాళ్లు ఉన్నారన్నారు. సీఎం రాయలసీమ వాసులుగా ఉండి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని కాల్వ పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రాజెక్టు పనులు పడకేశాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే అభివృద్ధి జరగదు అనే విషయం వైసీపీ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు.
ఈ మూడున్నరేళ్లలో ఎమ్మెల్యేలు జగన్ ను రాయలసీమను అభివృద్ధి చేయండని ఎందుకు అడగలేదని కాల్వ ప్రశ్నించారు.రాయలసీమ మొత్తం వారి ఆధిపత్యంలోనే నడుస్తోందని, కడపలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, అనంతపురంలో వెంకటరామిరెడ్డి లు ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడుతారే.. జగన్ ను ఎందుకు అడగరు అని నిలదీశారు. అభివృద్ధి వికేంద్రీకరణను కోరుకునే వ్యక్తి చంద్రబాబని, ఆ వికేంద్రీకరణలో అభివృద్ధి ఉండాలన్నారు. చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులకు 5 సంవత్సరాల్లో రూ.10,747 కోట్లు ఖర్చు చేశారని, జగన్ అధికారంలోకి వచ్చి ఈ మూడున్నర సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కేవలం రూ.2,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రాయలసీమ గొంతు కోశారన్నారు. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్థిక అవసరాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. కేసీఆర్ తో అంటకాగుతూ రాయలసీమకు తీరని ఇబ్బందులు సృష్టించారన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి రాయలసీమను నాశనం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే కోట్ల రూపాయల ఆదాయం కోసం రాయలసీమ భవిష్యత్తును తాకట్టు పెట్టారు. ఇలా ఎంతకాలం మోసం చేస్తారు? చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రకం వైసీపీదన్నారు. అలా రాయలసీమ పేరు చెప్పి పేదరికాన్ని చూపి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. తరతరాలుగా రాయలసీమను దోచుకుతింటున్నా ఇంకా మీ కడుపు నిండలేదా? అని ప్రశ్నించారు. రాయలసీమకు మీరెంత ఖర్చు పెట్టారో, మేమెంత ఖర్చు పెట్టామో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
-
పెన్షన్ పెంపు, వారికి ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు: సీఎం సంచలన ప్రకటన -
రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!! -
ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు సిద్ధంగా ఉండండి -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్












Click it and Unblock the Notifications