వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు, ఆయన బృందానికి పిచ్చి ముదిరింది...! ఎమ్మెల్యే రోజా

|
Google Oneindia TeluguNews

బాక్సైట్ తవ్వకాలను తామే రద్దు చేశామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం పై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగానే విశాఖలో బాక్సౌట్‌ తవ్వకాలను రద్దు చేశారని ఆమె తెలిపారు. విశాఖ మన్యంలో గిరిజనులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత వైఎస్ఆర్‌సీపీకే దక్కుతుందని ఆమె చెప్పారు. మొత్తం అయిదు జీవోల ద్వార బాక్సైట్ తవ్వకాలకు వైఎఎస్‌ఆర్ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు.

అయితే చంద్రబాబు నాయుడు బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. చంద్రబాబుతో పాటు ఆయన వర్గానికి పిచ్చి బాగా ముదిరిపోయిందని ఈ సంధర్భంగా విమర్శించారు. వారిని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని ఎద్దేవా చేసిన ఆమె చంద్రబాబు విధానాల వల్ల ఓ గిరిజన ఎమ్మెల్యే మావోయిస్టుల చేతిలో హతమయ్యారని ఆరోపించారు.

TDP president chandrababu naidu got mad : MLA Roja

విశాఖ ఏజెన్సీలో గత ప్రభుత్వం 30 ఏళ్ల పాటు లీజుకిచ్చిన బాక్సైట్‌ తవ్వకాల అనుమతిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.... అనంతగిరి రిజర్వ్‌ ఫారెస్ట్‌, జెర్రెల బ్లాక్ , గాలికొండ, చిత్తమగొండి, రక్తికొండ, చింతపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌ గ్రామాల్లో బాక్సైట్‌ అనుమతులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే బాక్సైట్ తవ్వకాలను ఇదివరకే తాము రద్దు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు.గతంలోనే రద్దు చేసిన తవ్వకాలను ఎన్నిసార్లు రద్దు చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు.

English summary
MLA Roja criticised tdp president chandrababu naidu for which was made comments on bauxite mining lease ban.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X