తెలంగాణలో ఓటు ట్విస్ట్, ఏపీలో జూపూడికి బ్యాడ్లక్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన జూపూడి ప్రభాకర రావును దురదృష్టం వెన్నంటింది. ఆయనను అదృష్టం పలకరించినట్లే పలకరించి వెక్కిరించింది. ఏపీ శాసన సభలో టీడీపీ తరఫున ఎమ్మెల్సీ స్థానం దక్కినట్టే దక్కి అతనికి చేజారిపోయింది.
అందుకు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు లేకపోవడమే కారణం. ఆయనకు ఏపీలో ఓటు హక్కు లేకపోవడంతో తదుపరి సమస్యలు వస్తాయని భావించిన టీడీపీ ఆయన అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టింది. ఆయన స్థాంలో ప్రతిభా భారతికి దక్కవచ్చునని తెలుస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో స్థానికత తప్పనిసరి. జూపూడికి అవకాశం లేకపోవడంతో ఆ స్థానంలో మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న టీడీపీ ప్రతిభా భారతి వైపు మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.
జూపూడి ప్రభాకర రావుకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఓటు హక్కు ఉంది. జూపూడితో పాటు చాలామంది ఏపీ నాయకులకు, హైదరాబాదులో ఉంటే ఏపీ వాసులకు తెలంగాణ రాజధానిలోనే ఓటు హక్కు ఉంది. జూపూడికి కూకట్ పల్లిలో ఓటు హక్కు ఉంది. ఇదే ఆయనకు మైనస్ అయింది.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications