జూనియర్ ఎన్టీఆర్ కు మరో ట్రాప్ : చిక్కుతారా - సినిమా చూపిస్తారా..!!
జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగా కొత్త రాజకీయం మొదలైందా. ఇప్పుడు తారక్ లక్ష్యంగా ఎందుకు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో తారక్ పేరు ఎందుకు చర్చల్లో నిలుస్తోంది. ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ సాగుతోంది. టీడీపీ అభిమానులు వర్సస్ తారక్ ఫ్యాన్స్ అన్నట్లుగా పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా తారక్ ఏ విషయంలో స్పందించినా..టీడీపీ శ్రేణలకు రుచించటం లేదు.

తారక్ ను టార్గెట్ చేస్తున్నారా
తారక్ కొన్ని అంశాల్లో స్పందిస్తున్న దాని కంటే ఎక్కువగా తారక్ రియాక్షన్ వారు కోరుకుంటున్నారు. తారక్ ను టీడీపీ శ్రేణులు విమర్శలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నచ్చటం లేదు. ఏపీ అసెంబ్లీలో తన సతీమణి గురించి వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ సభను బహిష్కరించి..చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో తారక్ స్పందించిన తీరు పైన టీడీపీ నేతలు ఓపెన్ గానే విమర్శలు చేసారు. అదే విధంగా కొద్ది రోజుల క్రితం విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం పైన జూనియర్ స్పందించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేసాయి. ఆ సమయంలో జూనియర్ ఒక ట్వీట్ చేసారు. ఎన్టీఆర్- వైఎస్సార్ ఇద్దరి గురించి ప్రస్తావించారు. పేరు మార్పు ద్వారా ఎవరి గౌరవం తగ్గిపోదు.. మరొకరి గౌరవం పెరిగదనే విధంగా ట్వీట్ లో పేర్కొన్నారు.

ఈ గ్యాప్ వెనుక కారణం ఏంటి
దీని పైన సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు జూనియర్ ను టార్గెట్ చేసారు. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో మూడు రాజధానులు వర్సస్ అమరావతి రాజకీయ వివాదం కొనసాగుతోంది. టీడీపీ అమరావతికి మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం అమరావతి రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూడు రాజధానుల రాజకీయ వివాదం పైన జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. కానీ, తాజాగా అమరావతి పాదయాత్రలో జూనియర్ ప్రస్తావన తీసుకొచ్చి..సవాళ్లు చేయటం పక్కాగా ముందస్తు ప్లాన్ గానే అభిమానులు భావిస్తున్నారు. ఇది.. జూనియర్ ను ఈ వివాదంలోకి లాగేందుకు ట్రాప్ చేస్తున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, దీని పైన ఇప్పటికే ఫ్యాన్స్ గట్టిగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా సమాధానం చెబుతున్నారు.

జూ ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో హైదరాబాద్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఒన్ టు ఒన్ సమావేశం అయ్యారు. ఆ తరువాత బీజేపీ ముఖ్య నేతలు ఆ సమావేశం రాజకీయంగా జరిగిదనేనంటూ చేసిన వ్యాఖ్యలు మరింత ఉత్కంఠ ను పెంచాయి. ఈ సమయంలోనే జూనియర్ టార్గెట్ చేయటం తీవ్రత పెరిగింది. టీడీపీ నేతలు ఈ అంశం పైన మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు ఓపెన్ గా చేయలేదు. అటు సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను ఇప్పుడు ఇలాంటి అంశాల్లో ప్రస్తావించటం వెనుక అసలు రాజకీయం ఏంటనే చర్చ మొదలైంది. దీంతో..రానున్న రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు..
ఈ వ్యవహారం ఎటువంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications