డేరాబాబా కంటే దేశద్రోహి: టిజి, కవిత, అధినేతలకు షాక్.. కంచ ఐలయ్యపై ఒక్కటైన టిడిపి-వైసిపి!
సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకం రాసిన వివాదాస్పద రచయిత కంచ ఐలయ్యపై ఆర్య వైశ్య నేతలు మండిపడుతున్నారు.
Recommended Video

అమరావతి/హైదరాబాద్: సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకం రాసిన వివాదాస్పద రచయిత కంచ ఐలయ్యపై ఆర్య వైశ్య నేతలు మండిపడుతున్నారు.
హైదరాబాద్లో ఆదివారం నాడు ఆర్యవైశ్య మహాసభ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిడిపి, వైసిపిలకు చెందిన పలువురు ఆర్యవైశ్య నేతలు హాజరయ్యారు.

దేశద్రోహులతో సమానం, అరబిక్ దేశాల్లో..
ఈ సందర్భంగా టిడిపి నేత, రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ రచయిత కంచ ఐలయ్యపై నిప్పులు చెరిగారు. సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి వాళ్లు దేశద్రోహులతో సమానమన్నారు. అరబిక్ దేశాలలో ఇలాంటి వాళ్లను నడిరోడ్డు మీద శిక్షిస్తారని చెప్పారు.

నడిరోడ్డుపై ఉరితీసేలా చట్టాలు
ఒక మతాన్ని, ఒక కులాన్ని కించపరిచే ఇలాంటి వాళ్లను నడిరోడ్డు మీద ఉరితీసేలా చట్టాలు తీసుకు రావాలని టిజి వెంకటేష్ అన్నారు. అప్పుడే కులాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి సంఘటనలు తగ్గుతాయన్నారు. మతిభ్రమించిన కొంతమంది నేతలు ఐలయ్యకు మద్దతు తెలుపుతున్నారన్నారు.

మూర్ఖంగా పుస్తకం రాయడం కాదు, వైశ్యుల చరిత్ర తెలుసుకో
అన్ని ప్రాంతాల్లో ఐలయ్యపై కేసులు పెట్టి దేశమంతా తిప్పుతామన్నారు. మూర్ఖంగా పుస్తకం రాయడం కాదని, వైశ్యుల చరిత్ర తెలుసుకోవాలని టిజి వెంకటేష్ మండిపడ్డారు. మతాన్ని, కులాన్ని కించపరచడం సరికాదన్నారు.

డేరా బాబా కంటే పెద్ద ద్రోహి
కంచ ఐలయ్య డేరా బాబా కంటే పెద్ద ద్రోహి అని సినీ నటి కవిత మండిపడ్డారు. వైశ్యులను కించపరిచిన ఐలయ్యకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. అలాగే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావులు చొరవ తీసుకొని ఆయనను కఠినంగా శిక్షించాలన్నారు.

కంచ ఐలయ్యకు తగదు
ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహించే ఆర్య వైశ్యులను కించపరచడం కంచ ఐలయ్యకు తగదని నటి కవిత అన్నారు. సామాజిక దృక్పథంతో పని చేస్తున్న ఆర్య వైశ్యులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.

అప్పటిదాకా దూరం.. బాబు-జగన్లకు ఓ విధంగా అల్టిమేటం
కాగా, కంచ ఐలయ్యపై పార్టీలకు అతీతంగా టిడిపి, వైసిపిలకు చెందిన ఆర్య వైశ్య నేతలు భేటీ అయ్యారు. ఐలయ్యపై చర్యల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని నిర్ణయించారు. అప్పటి వరకు ఇంటింటికి టిడిపి, వైసిపి కుటుంబం కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఇరు పార్టీలలోని వైశ్య నేతలు నిర్ణయించారని తెలుస్తోంది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలని, చర్యలు తీసుకొకుంటే ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయించారు.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications