మోడీపై ఫైర్ అయి, బీజేపీ నేతతో నవ్వులు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే సభాపతి మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి చేస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ పేరుతో బడిబాట కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. అదనంగా ఉన్న టీచర్లను ఆదే మండలంలోని ఇతర స్కూళ్లకు బదిలీ చేస్తామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగిన ఉపాధ్యాలులు లేరని డీకే అరుణ అన్నారు. 200 మంది విద్యార్థులు ఉన్నచోట కూడా ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారని, గ్రామాల్లో ఎంతోమంది చదువుకు దూరమవుతున్నారన్నారు. ప్రతి పాఠశాలలో స్పీకర్, వాచ్మన్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల సంఖ్య లేదని పాఠశాలలు మూసివేత వద్దని బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉందన్నారు.
వి హనుమంత రావు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు గురువారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. మోడీ స్వచ్చ భారత్ పైన విమర్శలు గుప్పించారు.
వి హనుమంత రావు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు గురువారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. నరేంద్ర మోడీ పైన విరుచుకు పడ్డారు.
డీకే అరుణ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ గురువారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న దృశ్యం.
డీకే అరుణ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ గురువారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న దృశ్యం.
కే లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ గురువారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో ఇలా..
కే లక్ష్మణ్, విహెచ్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావులు అసెంబ్లీ ప్రాంగణంలో..
కే లక్ష్మణ్, విహెచ్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావులు అసెంబ్లీ ప్రాంగణంలో..
కే లక్ష్మణ్, విహెచ్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావులు అసెంబ్లీ ప్రాంగణంలో..
లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న దృశ్యం.
లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న దృశ్యం.
దీనిపై జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలు మూసివేయడం జరగదన్నారు. హేతుబద్ధీకరణ అంటే ఉన్నవాటిని మూసివేయడం కాదని, లేనిచోట ఇవ్వడమన్నారు. కొన్ని పాఠశాలల్లో 20 మంది విద్యార్థులు ఉంటే 10మంది ఉపాధ్యాయులు ఉన్నారని, అవసరమైన వారిని ఉంచి ఎక్కువగా ఉన్న వారిని వేరేచోటకు పంపిస్తామన్నారు.
కాగా, గురువారం శాసన సభ మీడియా పాయింట్ వద్ద పలువురు మాట్లాడారు...