దత్తాత్రేయ ఆఫర్: టీ డీసీఎం ఓకే, కేసీఆర్ను అడిగాక...
హైదరాబాద్: రాజధానిలోని సనత్నగర్లో కొత్తగా నిర్మించిన ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్వహణ పైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య సుముఖత వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ఆయన శనివారం దిల్ కుశ గెస్ట్ హౌస్లో కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ఈఎస్ఐ ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్వహణ అఫ్పగిస్తామని దత్తాత్రేయ చెప్పారు. రాజయ్య అందుకు ఓకే చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వీటి వల్ల తెలంగాణకు మేలు జరుగుతుందని, నిర్వహణ కొంత భారమైనా చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం కూడా సహకారం అందించాలన్నారు.
దత్తాత్రేయ వద్దకు రాజయ్య
రాష్ట్రీయ స్వస్థ బీమా యోజనను రాష్ట్రంలోని బీడీ కార్మికులకు వర్తింప చేయాలని రాజయ్య ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కోరారు.
దత్తాత్రేయ వద్దకు రాజయ్య
స్వచ్ఛ భారత్ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపునకు నిర్ణయం తీసుకోవాలని కూడా ఉప ముఖ్యమంత్రి రాజయ్య సూచించారు. దీనిని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్తానని దత్తాత్రేయ చెప్పారు.
దత్తాత్రేయతో రాజయ్య
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను ఆప్యాయంగా పలకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య.
దత్తాత్రేయతో రాజయ్య
రాజధానిలోని సనత్నగర్లో కొత్తగా నిర్మించిన ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్వహణ పైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య సుముఖత వ్యక్తం చేశారు.
దత్తాత్రేయతో రాజయ్య
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ఆయన శనివారం దిల్ కుశ గెస్ట్ హౌస్లో కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ఈఎస్ఐ ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్వహణ అఫ్పగిస్తామని దత్తాత్రేయ చెప్పారు. రాజయ్య అందుకు ఓకే చెప్పారు.
దత్తాత్రేయతో రాజయ్య
ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వీటి వల్ల తెలంగాణకు మేలు జరుగుతుందని, నిర్వహణ కొంత భారమైనా చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం కూడా సహకారం అందించాలన్నారు.