నాడు కిరణ్నూ ఎక్కువమంది వ్యతిరేకించారు: టిపై ఖాన్
హైదరాబాద్: అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మెజార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారని, ఆనాడు సిఎల్పీలో ఓటింగు జరిగిందా అని రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ గురువారం ప్రశ్నించారు. తెలంగాణపై హైకమాండ్ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు.
పూర్తి సంప్రదింపుల తర్వాతనే కాంగ్రెసు పార్టీ విభజనపై నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు, పార్టీ ముఖ్యులందరితో మాట్లాడాకే తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.

విడిపోతే ఏడు సీట్లే: తులసి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ విడిపోతే 2014 ఎన్నికల్లో ఇరుప్రాంతాల్లో కలిపి ఏడు ఎంపీ సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వస్తాయని 20 సూత్రాల అమలు పథకం చైర్మన్, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి వేరుగా అన్నారు. ఆయన గురువారం ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి లేఖ రాశారు.
సివోటర్స్, ఇండియా టివి, టైమ్స్నౌ నిర్వహించిన సర్వే ఫలితాలను ఉటంకిస్తూ రాష్ట్రం కలిసుంటే 25 నుంచి 30 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికైనా విభజన ప్రక్రియను ఆపి రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని పార్టీని కాపాడాలని ఆయన అధిష్టానాన్ని కోరారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications