తెలంగాణా కు వర్తించని ఎన్నికల కోడ్ ఆంధ్రాకు వర్తిస్తుందా .. లోకేష్ ఫైర్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఒక పక్క వైసీపీ , మరోపక్క బీజేపీ , ఇంకోపక్క టీఆర్ఎస్ మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. అంతే కాదు ఈసీ , సీఎస్ లు సైతం చంద్రబాబు ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తమ మీద జరుగుతున్న మాటల దాడిని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు..పవన్ కలిసారు: చిరంజీవి ఆయనతో ఏం చెప్పారు : అందరి దృష్టి వారి మీదే : ...!
ఈసీ తీరుపై ట్విట్టర్ వేదికగా మంత్రి లోకేష్ ఫైర్
ఈసీనే ధిక్కరిస్తున్నారని చంద్రబాబుపై ప్రత్యర్ధి వర్గాలు చేస్తున్న ఆరోపణలపై తన పోరాటం ఈసీపై కాదు ఈసీ అనుసరిస్తున్న విధానాలపై అని చంద్రబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక ఏపీ మంత్రి నారా లోకేష్ ఈసీ పై చాలా ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి పేరుతో ప్రభుత్వం చేసే సమీక్షలపై ఈసీ ఆంక్షలపై లోకేష్ ట్విట్టర్ ద్వారా చాలా ఘాటుగా స్పందించారు.
ఎన్నికల సంఘం ఆంక్షలు ఒక్క టీడీపీకేనా అని లోకేష్ మండిపాటు
ఎన్నికల సంఘం ఆంక్షలన్నీ ఒక్క టీడీపీకే వర్తిస్తాయా అంటూ లోకేష్ ఈసీని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ కేవలం ఒక్క ఏపీకే వర్తిస్తుందా అని లోకేష్ అన్నారు. "ఎండలు, తాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తే ఈసీకి సమస్య ఎక్కడినుండి వచ్చిందో చెప్పాలని లోకేష్ అన్నారు. పాలనాపరమైన సమీక్షలకు కూడా నో చెప్పటం ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఏపీ ప్రజల సమస్యలను గాలికి వదిలెయ్యమని చెప్పటం ఒక్క ఏపీలోనే వుంది అని ఆయన మండిపడ్డారు.
తెలంగాణలో వర్తించని కోడ్ ఏపీకే వర్తిస్తుందా .. లోకేష్ ప్రశ్న
ప్రస్తుతం ఏపీలోని సమస్యలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోకపోతే ఎండా కాలంలో ప్రజల పరిస్థితి ఏమవుతుంది, ఈ అంశంపై ఎన్నికల సంఘం ఎందుకు ఆలోచించడం లేదని లోకేష్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జరిపే సమీక్షల్లో ప్రభుత్వ అధికారులు, పోలీసులు కూడా పాల్గొంటున్నారని, తెలంగాణాలో వర్తించని కోడ్ కేవలం ఏపీకే వర్తిస్తుందా.. అలా ఎలా అని లోకేష్ ఎన్నికల సంఘాన్ని నిలదీశారు.