‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ ఆవిష్కరణలో కెటిఆర్(పిక్సర్స్)
హైదరాబాద్: అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో నివసిస్తున్న ప్రజలకు వైవిధ్యమూన జీవిన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పంజాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమలు, ఐటి శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొషన్లు సంయుక్తంగా ‘హ్యాపెనింగ్ హైదరాబాద్' పేరుతో ఏడాదిపాటు నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార లోగో, వెబ్సైట్, మొబైల్ యాప్ను గురువారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కేవలం పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు ఉంటే సరిపోవని.. జీవిన విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలకు వినోదం, వైజ్ఞానిక, క్రీడలు, వైవిధ్యభరితమైన వాతావరణం కూడా ఈ చారిత్రక నగరానికి అవసరమని తెలిపారు.
కెటిఆర్
అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో నివసిస్తున్న ప్రజలకు వైవిధ్యమూన జీవిన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పంజాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు.
కెటిఆర్
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమలు, ఐటి శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొషన్లు సంయుక్తంగా ‘హ్యాపెనింగ్ హైదరాబాద్' పేరుతో ఏడాదిపాటు నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార లోగో, వెబ్సైట్, మొబైల్ యాప్ను గురువారం ఆయన ఆవిష్కరించారు.
కెటిఆర్
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కేవలం పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు ఉంటే సరిపోవని.. జీవిన విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కెటిఆర్
ప్రజలకు వినోదం, వైజ్ఞానిక, క్రీడలు, వైవిధ్యభరితమైన వాతావరణం కూడా ఈ చారిత్రక నగరానికి అవసరమని తెలిపారు.
అలాంటి పరిస్థితులు కల్పించేందుకే 52వారాలు 52 కార్యక్రమాలు పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. హ్యాపెనింగ్ హైదరాబాద్ వార్షిక ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఉదయం ఫ్రీడం రైడ్(సైక్లింగ్), మధ్యాహ్నం వింటేజ్ కార్ ర్యాలీ, సాయంత్రం ఖాదీ ఫ్యాషన్ అంశాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు లోగో, ట్యాగ్లైన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని చెప్పారు. దుర్గం చెరువు వద్ద అద్భుతమైన పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉండటంతో అక్కడ రూ. 100 కోట్లతో హ్యాంగింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు. కళాకారులను ప్రోత్సాహించేందుకు ఢిల్లీలోని కళాకృతి నిలయం కంటే మెరుగైన నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.