'హైదరాబాద్పై మూడు ప్రతిపాదనలు మీడియా సృష్టే'
షిండేతో భేటీ అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. మూడు ప్రతిపాదనల పరిశీలన కేవలం మీడియా సృష్టేనని షిండే చెప్పారన్నారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు చెప్పారు. భద్రాచలం సబ్ డివిజన్ను తాము ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని, దానిని ఖమ్మంలోనే ఉంచాలని కోరామన్నారు.
షిండేతో ముఖ్యమంత్రి భేటీ
షిండేతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు.
ఎపిఎన్జీవోల సమ్మెపై విచారణ వాయిదా
ఎపిఎన్జీవోల సమ్మెపై విచారణను హైకోర్టు ఈ నెల 27వ తేదికి వాయిదా వేసింది. రెండు పేజీలకు మించకుండా రాతపూర్వక వాదనలు సమర్పించాలని పిటిషనర్, ప్రతివాదులను న్యాయస్థానం ఆదేశించింది.
సహనం కోల్పోం: అశోక్ బాబు
ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా తాము సహనం కోల్పోదల్చుకోలేదని ఎపిఎన్జీవో అశోక్ బాబు అన్నారు. హైదరాబాదు ఏ ఒక్కరితోనే అభివృద్ధి చెందలేదన్నారు. హైదరాబాద్ అందరిదన్నారు. ప్రజల వద్దకు ఎంపీలు రావాలంటే రాజీనామాలు చేయాల్సిందేనని చెప్పారు. ఈ నెల 30 తర్వాత సమ్మెను తీవ్రతరం చేస్తామన్నారు.