తిరుపతిని అడిగామా, మాటమారింది: సిఎంపై కోమటిరెడ్డి
మూడున్నరేళ్ల క్రితం అధిష్టానమే అంతా అని చెప్పిన కిరణ్ మాట ఇప్పుడు ఎందుకు మారిందో చెప్పాలన్నారు. అప్పుడు పార్టీ ముఖ్యమని చెప్పి ఇప్పుడు సిడబ్ల్యూసి నిర్ణయాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు. రాష్ట్రపతి పాలన విధించైనా తెలంగాణను ఇస్తారని చెప్పారు.
టిటిడిపి నేతలపై కడియం ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావుల పైన తెలంగాణ రాష్ట్ర సమితి నేత కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో మండిపడ్డారు. పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన వారిద్దరు జనాల్లో ఉండటం మంచిది కాదన్నారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన చేసిన వ్యాఖ్యలను కడియం ఖండించారు.
జిల్లాలో ఎవరు దోపిడీదారులో ఆధారాలతో బయటపెడతామని హెచ్చరించారు. రాజకీయ దిగజారుడు మాటలు మార్చుకోవాలని కడయం హితవు చేశారు. వారిద్దరు తమ ప్రవర్తన మార్చుకోకపోతే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు. ఎర్రబెల్లి ఆస్తులపై నివేదిక ఇస్తామన్నారు.