వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుపతిని అడిగామా, మాటమారింది: సిఎంపై కోమటిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komatireddy Venkat Reddy
హైదరాబాద్: తాము ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుపతికి వెళ్తున్నామని చెప్పి దానిని తమకు ఇవ్వాలని అడుగుతున్నామా అని మాజీ మంత్రి, నల్గొండ జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి బుధవారం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడున్నరేళ్ల క్రితం అధిష్టానమే అంతా అని చెప్పిన కిరణ్ మాట ఇప్పుడు ఎందుకు మారిందో చెప్పాలన్నారు. అప్పుడు పార్టీ ముఖ్యమని చెప్పి ఇప్పుడు సిడబ్ల్యూసి నిర్ణయాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు. రాష్ట్రపతి పాలన విధించైనా తెలంగాణను ఇస్తారని చెప్పారు.

టిటిడిపి నేతలపై కడియం ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావుల పైన తెలంగాణ రాష్ట్ర సమితి నేత కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో మండిపడ్డారు. పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన వారిద్దరు జనాల్లో ఉండటం మంచిది కాదన్నారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన చేసిన వ్యాఖ్యలను కడియం ఖండించారు.

జిల్లాలో ఎవరు దోపిడీదారులో ఆధారాలతో బయటపెడతామని హెచ్చరించారు. రాజకీయ దిగజారుడు మాటలు మార్చుకోవాలని కడయం హితవు చేశారు. వారిద్దరు తమ ప్రవర్తన మార్చుకోకపోతే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు. ఎర్రబెల్లి ఆస్తులపై నివేదిక ఇస్తామన్నారు.

English summary
Former Minister and Congress Party senior leader Komatireddy Venkat Reddy on Wednesday said Telangana people are not asking for Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X