సెటిల్మెంట్ చేస్తున్న సినీ నిర్మాత అరెస్ట్, గన్స్ స్వాధీనం(పిక్చర్స్)
హైదరాబాద్: అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న తెలుగు సినీ నిర్మాత, దరక్శకుడు బెజ్జం రాజేష్ పుత్రను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి అతడి నుండి రెండు తుపాకులు, 16 రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
గురువారం నాడు టాస్క్ఫోర్స్ డీసీపీ లింబా రెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ విలేకరులకు వివరాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రాజేష్ పుత్ర వయస్సు నలభై నాలుగు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో ఉంటున్నాడు.
ఇతడి పైన 11 క్రిమినల్ కేసులు, ఏలూరు గ్రామీణ పోలీసు స్టేషన్లో రౌడీషీట్ నమోదయి ఉంది. 1998లో ఏలూరు లోకసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇతడి భార్య అచ్చాయమ్మ గత ఏడాది ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఏలూరు రూరల్ నుండి ఎన్నికయ్యారు.
సినీ నిర్మాత
ఏలూరు టౌన్ కోర్టు ఆవరణలో 2010లో సంచలనం సృష్టించిన తాడేపల్లిగూడెంకు చెందిన రౌడీషీటర్ రవి హత్య కేసులో ఇతడు నిందితుడు కూడా.
సినీ నిర్మాత
బీహార్కు చెందిన ఓ వ్యక్తి ద్వారా రాజేష్ పుత్ర నాలుగు తుపాకులను గతంలో తెప్పించుకున్నాడు. వాటిలో రెండింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రాజేష్ పుత్రతో పాటు ముగ్గురు నిందితులకు ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు.
సినీ నిర్మాత
అందులో ఇద్దరు హత్యకు గురయ్యారు. కాగా, రాజేష్ పుత్ర పలు తెలుగు సినిమాలకు నిర్మాతగా, దర్శకుడిగా పని చేశాడు. ఆంటీ అంకుల్ నందగోపాల్ చిత్రానికి నిర్మాత. నవాబ్ బాషా, దావూద్, సానియా చిత్రాల నిర్మాణం చేపట్టాడు.
సినీ నిర్మాత
కాగా, రాజేష్ కొంతకాలంగా హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు.