ఒడిషా వర్సిటీ ప్రాంగణంలో శవమైన ఆంధ్ర విద్యార్థి: హత్యేనని పేరెంట్స్
ఏలూరు : ఒడిషాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతన్ని వంశీకృష్ణగా గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం బొర్రపాలెంకు చెందిన వంశీ పర్లాకిమిడి సెంచరియన్ యూనివర్శిటీలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.
అయితే వంశీ వర్శిటీ ప్రాంగణంలో శవమై కనిపించాడు. తోటి విద్యార్థులు గమనించి విశ్వవిద్యాలయం యాజమాన్యానికి సమాచారం అందించారు. తమ కుమారుడిది ముమ్మాటికి హత్యేనని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ బిడ్డ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాగా, వంశీకృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కాలేజీ యాజమాన్యం అంటోంది. మీడియాలో వచ్చిన వార్తాకథనాల ప్రకారం - వంశీకృష్ణ శవం పడి ఉన్న చోట ఆనవాళ్లు లభించకుండా శుభ్రం చేశారు. అతడి శరీరంపై గాయానికి సంబంధించిన ఆనవాళ్లున్నాయి.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల మధ్య గల కక్షలు వంశీకృష్ణ మృతికి కారణమై ఉండవచ్చుననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఒడిషాలోని ఓ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థి వంశీకృష్ణ శవమై కనిపించాడు. అతన్ని హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications