డ్రామా: రేవంత్ సహా టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్, ట్రాఫిక్జాం
హైదరాబాద్: సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారంటూ పదిమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను శాసన సభ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సభ నుండి సస్పెండైన వీరు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఎమ్మెల్యేలను తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. అయితే, సభ్యులు వాహనం దిగి అసెంబ్లీ ఎదుట ఉన్న రోడ్డు పైన బైఠాయించేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జాం అయింది. నలువైపులా వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు టీడీపీ సభ్యులను అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టి నిర్వహించిన సమగ్ర సర్వేలో ఎంపీ కవిత రెండుచోట్ల ఎలా నమోదు చేయించుకున్నారన్న విషయమై శాసనసభలో ప్రశ్నిస్తే, నా కూతురు గురించి మాట్లాడుతారా? అంటూ 10 మందిని సస్పెండ్ చేశారన్నారు.
తెరాస నేతలు రెండు రోజులు సభ జరుగకుండా అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలపై నిలదీస్తామని భయపడ్డ ప్రభుత్వం తమను వారం రోజులపాటు సస్పెండ్ చేసిందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టే అలోచన చేస్తామన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications