బాబు సూచన మేరకు శ్రీవారి ఆలయాలు: చదలవాడ కృష్ణమూర్తి
తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన వేరకు విజయవాడ, రాజమండ్రిల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. మంగళవారం జరిగిన టిటిడి పాలక మండలి సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలోని భద్రాచలం క్షేత్రంలాగానే కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో మహామణి నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. టిటిడిలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం కోసం తిరుమలలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు చదలవాడ చెప్పారు.

పాలక మండలి సమావేశంలో టిటిడి పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పేరూరులో వకుళమాత ఆలయాన్ని పునర్నిర్మిస్తామని కమిటీ తెలియజేసింది. ఒంటిమిట్ట రామాలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు, భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది.
టిటిడి వినియోగించే సోనామసూరి బియ్యాన్ని రూ. 35కు కొనుగోలు, టిటిడి ఉద్యోగుల యాత్రికుల పరిహార భత్యాన్ని 1500 నుంచి 2500కు పెంపు, సురాపురం తోట గదుల అద్దెను 750 నుంచి 1500 పెంపు, గోవిందరాజుల ఆలయం అభివృద్ధికి రూ. 59లక్షల కేటాయింపు నిర్ణయాలకు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది.
కాగా, రూ. 72 కోట్లతో నూతనంగా వసతి సముదాయాలు ఏర్పాటు, 50 కోట్లతో కొనుగోళ్లకు ఆమోదం, రూ. 10 కోట్లతో తిరుపతిలోని 2వ, 3వ సత్రాల ఆధునీకరణ వంటి కీలకమైన వాటికి పాలక మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications