పగులు రెక్కీ.. రాత్రి ఇళ్లల్లో చోరీ.. అరెస్టు(ఫోటోలు)
విశాఖపట్నం: ఆకతాయిలుగా వీధుల్లో తిరుగుతూ రెక్కి నిర్వహించి ఎవరూ లేని సమయంలో ఇళ్లల్లో చోరీ చేస్తోన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని క్రైం డీసీపీ రవికుమార్ మూర్తి తెలిపారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు.
విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం, చీపురుపల్లి గ్రామానికి చెందిన షేక్ అజీజ్ (26), విశాఖలోని అక్కయ్యపాలెంలో నివసిస్తోన్న పసల హేమంత్ (21), గాజువాక పిలకవాని పాలెంకు చెందిన పున్నపు ప్రసాద్ రావు (35) కలిసి చోరీలు చేస్తున్నారని పేర్కొన్నారు.
గాజువాక ప్రాంతంలో తాళాలు వేసి ఉన్న ఇంటిని కనిపెట్టి యజమాని లేని సమయం చూసుకొని చోరీకి ప్రయత్నించారని వివరించారు. గత నెల 15న ఎవరూ లేని సమయం చూసుకుని ఓ ఇంటి తాళాలు బద్దలు కొట్టి 177 గ్రామలు, 138 వెండి ఆభరణాలను చోరీ చేసి పరారయ్యారని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
సిబ్బంది నిందుతలపై నిఘా కట్టుదిట్టం చేసి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుల నుంచి 196 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వీరు వెండి ఆభరణాలను అమ్మేసి, బంగారు ఆభరణాలను భద్రపరుచుకున్నారని తెలిపారు.
నకిలీ నోట్లతో బీహారి ముఠా అరెస్టు
బీహార్ నుంచి నగరానికి నకిలీ కరెన్సీ నోట్లు తీసుకొచ్చి చెలామణీ చేస్తున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నామని క్రైం డీసీపీ రవికుమార్ మూర్తి తెలిపారు. బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లా, కిరియావ గ్రామానికి చెందిన మహ్మద్ జియా (27), మజఫర్ జిల్లా, మహ్మాద్ పూర్ ఖార్జా ప్రాంతానికి చెందిన మహ్మాద్ అనిల్ సోహిల్ (26)లు విశాఖ నగరంలోని సింహాద్రి పురం హెచ్బీ కాలనీలో నివసిస్తున్నారు.
మహ్మాద్ జియా, సోహిల్లు నగరంలో వస్త్రాలకు ఎంబ్రాయిడరింగ్ చేస్తూ జీవిస్తున్నారు. ఐతే సొంతంగా దుకాణం పెట్టుకోవాలనే ఆలోచనతో బీహార్కు వెళ్లిన జియా... తన స్నేహితుడు బహుల్ వద్దకు అప్పు కోసం వెళ్లాడు. అప్పు సంగతి పక్కనబెట్టి... నకిలీ కరెన్సీ నోట్లను మార్పు చేస్తే వెయ్యికి రూ. 300 కమిషన్ ఇస్తానని చెప్పగా సుమారు రూ. 50 వేల నగదును నగరానికి తీసుకొచ్చి స్నేహితుడు సోహిల్తో కలిసి చెలామణీ చేస్తున్నారని పోలీసులు వివరించారు.
ఓ కూడలిలో పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తుండటంతో భయంతో వెనుకకు తిరిగి వెళ్ళిపోతుండగా అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తులో నిజాలు వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 25వేల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ వరదరాజు, ఏసీపీ మహేష్, ఎస్సై కుమార్ స్వామి సిబ్బంది పాల్గొన్నారు.

ఇళ్లల్లో చోరీ చేస్తున్న నిందితులు అరెస్టు
ఆకతాయిలుగా వీధుల్లో తిరుగుతూ రెక్కి నిర్వహించి ఎవరూ లేని సమయంలో ఇళ్లల్లో చోరీ చేస్తోన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని క్రైం డీసీపీ రవికుమార్ మూర్తి తెలిపారు.

ఇళ్లల్లో చోరీ చేస్తున్న నిందితులు అరెస్టు
విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం, చీపురుపల్లి గ్రామానికి చెందిన షేక్ అజీజ్ (26), విశాఖలోని అక్కయ్యపాలెంలో నివసిస్తోన్న పసల హేమంత్ (21), గాజువాక పిలకవాని పాలెంకు చెందిన పున్నపు ప్రసాద్ రావు (35) కలిసి చోరీలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇళ్లల్లో చోరీ చేస్తున్న నిందితులు అరెస్టు
గాజువాక ప్రాంతంలో తాళాలు వేసి ఉన్న ఇంటిని కనిపెట్టి యజమాని లేని సమయం చూసుకొని చోరీకి ప్రయత్నించారని వివరించారు.

ఇళ్లల్లో చోరీ చేస్తున్న నిందితులు అరెస్టు
గత నెల 15న ఎవరూ లేని సమయం చూసుకుని ఓ ఇంటి తాళాలు బద్దలు కొట్టి 177 గ్రామలు, 138 వెండి ఆభరణాలను చోరీ చేసి పరారయ్యారని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

ఇళ్లల్లో చోరీ చేస్తున్న నిందితులు అరెస్టు
సిబ్బంది నిందుతలపై నిఘా కట్టుదిట్టం చేసి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుల నుంచి 196 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

ఇళ్లల్లో చోరీ చేస్తున్న నిందితులు అరెస్టు
వీరు వెండి ఆభరణాలను అమ్మేసి, బంగారు ఆభరణాలను భద్రపరుచుకున్నారని తెలిపారు.

నకిలీ నోట్లతో బీహారి ముఠా అరెస్టు
బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లా, కిరియావ గ్రామానికి చెందిన మహ్మద్ జియా (27), మజఫర్ జిల్లా, మహ్మాద్ పూర్ ఖార్జా ప్రాంతానికి చెందిన మహ్మాద్ అనిల్ సోహిల్ (26)లు విశాఖ నగరంలోని సింహాద్రి పురం హెచ్బీ కాలనీలో నివసిస్తున్నారు.

నకిలీ నోట్లతో బీహారి ముఠా అరెస్టు
నకిలీ కరెన్సీ నోట్లను మార్పు చేస్తే వెయ్యికి రూ. 300 కమిషన్ ఇస్తానని చెప్పగా సుమారు రూ. 50 వేల నగదును నగరానికి తీసుకొచ్చి స్నేహితుడు సోహిల్తో కలిసి చెలామణీ చేస్తున్నారని పోలీసులు వివరించారు.

నకిలీ నోట్లతో బీహారి ముఠా అరెస్టు
నిందితుల నుంచి రూ. 25వేల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ వరదరాజు, ఏసీపీ మహేష్, ఎస్సై కుమార్ స్వామి సిబ్బంది పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications