కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత: కోడి పందాల్లో ఇరు వర్గాల ఘర్షణ, గాయాలు
అమరావతి: సంక్రాంతి సంబరాల్లో భాగంగా గత మూడు రోజులుగా జరుగుతున్న కోడి పందాలు గొడవకు దారితీశాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి మండలం కృష్ణవరంలో చోటు చేసుకుంది. కోడి పందాల్లో భాగంగా చెలరేగిన చిన్న వివాదం ఈ ఉద్రిక్తతకు దారి తీసినట్లు సమాచారం.
రెండు వర్గాలుగా విడిపోయిన కొందరు వ్యక్తులు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కృష్ణవరంలో ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
దాడికి దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇరు వర్గాలకు చెందిన ప్రజలు పరస్పరం దాడి చేసుకోవడంతో గ్రామంలో మళ్లీ ఎలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేదుకు పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
Comments
English summary
Tension at krishnavaram, Aagiripalli mandal krishna district.
Story first published: Saturday, January 16, 2016, 15:08 [IST]