జీఎన్ రావు కమిటీ నివేదికతో సీమకు న్యాయం, 60 శాతం మందికి లబ్ధి: టీజీ వెంకటేశ్
ఏపీలో రాజధాని మార్పు అంశం హీటెక్కిస్తోంది. రాజధానుల ఏర్పాటుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అమరావతి ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీని వీడి బీజేపీలో చేరిన టీజీ వెంకటేశ్ మాత్రం స్వాగతించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జీఎన్ రావు కమిటీ నివేదికను బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ స్వాగతించారు. కమిటీ నివేదికలో రాయలసీమకు న్యాయం జరిగేలా రూపొందించారని పేర్కొన్నారు. సీమ దాదాపు 60 శాతం లబ్ది పొందుతుందని చెప్పారు. అమరావతి, కర్నూలులో మినీ సచివాలయాలు పెడితే బాగుంటుందని సూచించారు.

ఆంధ్రప్రదేశ్లో రాజధానుల ఏర్పాటుపై జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. రాజధానుల గురించి కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సుబ్బారావు మీడియాకు తెలియజేశారు. అమరావతిలో అసెంబ్లీ, రాజ్భవన్, మంత్రుల నివాసా సముదాయాలు ఉంటాయని..విశాఖపట్టణంలో సమ్మర్ అసెంబ్లీ నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు. వేసవిలో విశాఖపట్టణంలో అసెంబ్లీ నిర్వహించడానికి గల కారణం కూడా కమిటీ సభ్యుడు సుబ్బారావు వివరించారు. అమరావతిలో ఎండల వేడి ఉన్నందున వేసవి తాపం తట్టుకొనేందుకు విశాఖలో సమ్మర్ అసెంబ్లీ నిర్వహించాలని సూచించినట్టు పేర్కొన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications