Tomato కిలో రెండు రూపాయలు. కొనే దిక్కు లేదు
అతడు ఆశలతో విత్తనం వేశాడు.. చెమటను నీరుగా పోసి మొక్కను పెంచాడు. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చేతికొచ్చిన వేళ.. ఆ రైతు కళ్లల్లో ఆనందం ఉండాలి. కానీ, నేడు ఆ రైతు కళ్లలో కన్నీరు సుడిగుండం అవుతోంది. ఎర్రగా పండిన టమాటా పండును చూస్తుంటే అతడికి రక్తం మరిగినట్లు అనిపిస్తోంది. కారణం.. మార్కెట్లో ఆ పంటకు దక్కుతున్న వెల. కిలో రూ. 2.. అవును, అక్షరాలా రెండు రూపాయలు! టీ కప్పు ఖరీదులో నాలుగో వంతు కూడా రాని ఈ ధర చూసి, పండించిన పాపానికి పారేయలేక, అమ్ముకోలేక అన్నదాత ఆక్రందన వర్ణనాతీతం.
కేవలం నెల రోజుల కిందట పరిస్థితి వేరు. కిలో టమాటా రూ. 40 పలికినప్పుడు, ఈసారి అప్పులు తీరుతాయని రైతు ఆశపడ్డాడు. కానీ, ప్రకృతి వైచిత్రి అప్పుడూ ఇప్పుడూ రైతును వంచించింది. నవంబరు, డిసెంబరులో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులంతా ఒకేసారి నార్లు పోశారు. తీరా పంట కోతకు వచ్చేసరికి మార్కెట్లోకి దిగుబడి వరదలా వచ్చి పడింది. ఎకరాకు 15 టన్నులు వస్తుందనుకుంటే, ఈసారి ఏకంగా 20 టన్నుల దిగుబడి వచ్చింది. కానీ, ఆ 'అధిక దిగుబడే' ఇప్పుడు రైతు మెడకు ఉరితాడుగా మారింది.

ఖర్చు రూ. 50 వేలు.. ఆదాయం రూ. 35 వేలు!
ఉమ్మడి విజయనగరం జిల్లాలోనే అతి పెద్ద మార్కెట్ గా ఉన్న రామభద్రపురం మార్కెట్కు బొబ్బిలి పరిసర ప్రాంతాల నుంచి రైతులు ఎంతో ఆశతో వస్తున్నారు. ఎకరా సాగుకు మందులు, ఎరువులు, కూలీల ఖర్చు కలిపి సుమారు రూ. 50 వేలు అవుతోంది. కానీ, ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే మొత్తం పంటను విక్రయించినా రూ. 35 వేలు కూడా రావడం లేదు. అంటే ప్రతి ఎకరాపై రైతుకు సుమారు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల నికర నష్టం వాటిల్లుతోంది. ఇది కేవలం పెట్టుబడి ఖర్చు మాత్రమే.. రైతు శ్రమను లెక్కిస్తే ఆ నష్టం లెక్కలేనంత.
కూలీ డబ్బులు రాక.. పొలాల్లోనే కుళ్లిపోతున్న Tomato
మార్కెట్ వరకు తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చులు, బుట్టల ఖర్చు, లోడింగ్ ఛార్జీలు కలిపితే కిలోకు రెండు రూపాయలు కూడా మిగలడం లేదు. దీంతో చేసేదేమీ లేక చాలామంది రైతులు పంటను కోయడమే మానేశారు. "కోయడానికి కూలీల ఖర్చు కూడా వచ్చేలా లేదు, అందుకే పొలంలోనే వదిలేస్తున్నాం" అని పండుగా మారిన టమాటాను కుప్పలుగా పోస్తూ ఓ రైతు వాపోయాడు. రామభద్రపురం మార్కెట్లో రోజంతా నిరీక్షించినా అడిగే నాథుడు లేకపోవడంతో, ఎర్రటి ఎండలో రైతు గుండె రగులుతోంది.
పాలకుల చొరవ అవసరం
ఒకేసారి దిగుబడి రావడం వల్ల ధర పతనం అయ్యిందని ఉద్యానశాఖ అధికారులు విశ్లేషిస్తున్నప్పటికీ, ఈ సంక్షోభం నుంచి రైతును గట్టెక్కించే మార్గాలేవీ కనిపించడం లేదు. శీతల గిడ్డంగుల (Cold Storage) కొరత, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల లేమి రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోకపోతే.. రేపు టమాటా సాగు వైపు చూడటానికి కూడా రైతు భయపడే పరిస్థితి నెలకొంది..
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications