Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతులకు శుభవార్త ... ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ

రైతులకు శుభ వార్త . ఈ ఏడాది వర్షాలకు కొదవ లేదని , కరువు తీరా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్-సెప్టెంబరు మధ్య సగటు వర్షపాతంలో 96 శాతం నమోదవుతుందంటూ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతమే నమోదవుతుందంటూ ఏప్రిల్ 15న తొలి అంచనా నివేదికను ఇచ్చింది వాతావరణ శాఖ. ఇక తాజాగా మరింత సమాచారం జోడించిన వాతావరణ శాఖ శుక్రవారం రెండో దశ నివేదికను విడుదల చేసింది. చివరి రెండు నెలలకు సంబంధించిన తుది నివేదికను జూలై చివరిలో ఇవ్వనున్నట్టు తెలిపింది.

The good news for farmers ... weather department said plenty of rain this year

ఇక ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం రైతులకు మేలు చేస్తుంది. వ్యవసాయం సాఫీగా సాగుతుందని దీర్ఘకాల సగటుతో పోలిస్తే ఈసారి 96 శాతం వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం బలహీనమైన ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయని, నైరుతి ముగిసే వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఖరీఫ్‌కు ఎంతో కీలకమైన జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా 95 శాతం, 99 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. గత నెల 18న అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు 25నాటికి మాల్దీవులు, కొమరన్‌ తీరం వరకు విస్తరించాయని పేర్కొంది . ఆ తరువాత 4 రోజుల వరకు స్థిరంగా ఉన్న రుతుపవనాలు మే 30న అండమాన్‌లో అన్ని ప్రాంతాలు, ఆగ్నేయ, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించాయని తెలిపింది . ఫలితంగా జూన్‌ 6 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తానికి ఈసారి రైతన్నలకు సంతోషకరమైన వార్త చెప్పింది వాతావరణ శాఖ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+