నటుడు, ఎంపి మురళీమోహన్ పుత్రుడి ఇంట్లో చోరీ
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, రాజమండ్రి తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ కుమారుడు రామ్మోహన్ ఇంట్లో చోరీ జరిగింది. చోరీలో రామ్మోహన్ స్నేహితురాలు శ్రీలంక దేశానికి చెందిన యువతి నాచియాకు చెందిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. మొత్తం ఆరు లక్షల విలువ చేసే సొత్తు చోరీకి గురైనట్లు ఆదివారం రామ్మోహన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం - రామ్మోహన్ స్నేహితురాలు శ్రీలంకకు చెందిన నాచియా అనే యువతి ఓ వివాహానికి హాజరయ్యేందుకు జనవరి 28న హైదరాబాద్కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఫిలింనగర్లోని స్నేహితుడైన రామ్మోహన్ ఇంట్లో ఉంటున్నారు. వివాహ వేడుకలు ముగియడంతో ఆమె ఆదివారం శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తన వస్తువులు సర్దుతుండగా బంగారు ఆభరణాలు కనిపించలేదు.

ఇంట్లో ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంటి పని మనుషులపై అనుమానంతో వారి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
చోరీకి గురైన నాచయా ర్యూబీ నెక్లెస్, బంగారు ఉంగరం, ఆమె కూతురు నెక్లెస్ రూ. 10 వేల విలువ ఉంటుందని అంచనా. రామ్మోహన్ ఇంట్లోని పని మనుషుల్లో ఎవరైనా చోరీకి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు పని మనుషులను ప్రశ్నిస్తున్నారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications