ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్: సంక్రాంతి తర్వాత కేసీఆర్ దూకుడే
అమరావతి: భారత నిర్మాణంలో ఏపీ ప్రజలు కూడా బీఆర్ఎస్లో భాగస్వాములు కావాలన్నారు భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్. సోమవారం ఆయన సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నేతలు తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు, చింతల పార్థసారథి, టీజే ప్రకాశ్, రమేష్ నాయుడు, గిద్దల శ్రీనివాస్, జేటీ రామారావు తోపాటు భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో పలువురు కీలక నేతలకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్.
ఏపీ నుంచి ఫోన్లు వస్తున్నాయంటూ కేసీఆర్
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఏపీ నాయకులు, ప్రజలు బీఆర్ఎస్ను స్వాగతిస్తుండటం మంచి పరిణామమని అన్నారు. ఏపీతోపాటు పలు రాష్ట్రాల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయన్నారు. సంక్రాంతి తర్వాత ఉరుకులు పరుగులు ఉంటాయన్నారు. రావెల కిషోర్ బాబు, పార్థసారథి, చంద్రశేఖర్ బీఆర్ఎస్లోకి రావడం శుభపరిణామమని అన్నారు. రావెల తనతోపాటు జాతయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు.
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్
వైకుంఠ ఏకాదశి పర్వదినాన మంచి ప్రారంభం జరిగిందన్నారు కేసీఆర్.
ఆంధ్రప్రదేశ్ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను నియమిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. కర్తవ్య నిర్వహణలో విజయం సాధించాలని కోరుతున్నట్లు తెలిపారు. విజయం సాధిస్తారన్నారు. సంక్రాంతి పెద్ద పండగ తర్వాత తన ఆఫీసు కంటే ఏపీ ఆఫీసు ఎక్కువగా బిజీ అవుతుందని కేసీఆర్ అన్నారు. చాలా మందికి ఆశ్చర్య కలిగించే చేరికలుంటాయన్నారు. సిట్టింగ్ లు కూడా వస్తామంటున్నారని తెలిపారు.
సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ దూకుడే.. 7,8 రాష్ట్రాల్లో ఆఫీసులు
సంక్రాంతి తర్వాత 7,8 రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలు తెరుచుకుంటాయని కేసీఆర్ తెలిపారు. ఏపీ నేతల సేవలు వినియోగించుకుంటామని అన్నారు.తాజాగా, బీఆర్ఎస్లో చేరిన నేతలు వజ్రాలంటూ కొనియాడారు. ఇలాంటి నేతలు కలిసి రావడం మంచి పరిణామమని అన్నారు. ప్రత్యేక తరగతులు జరుగుతాయన్నారు. ఓర్వలేని వాళ్లు.. భయపడేవాళ్లు మనమీద విమర్శలు చేస్తారన్నారు. అవన్నీ పట్టించుకోవద్దన్నారు. మనం ముందుకే వెళ్లాలన్నారు. కార్యకర్తల భోజనం చేసి క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలన్నారు. ఏపీ నుంచి వచ్చినవారందరికీ స్వాగతం తెలిపారు కేసీఆర్. జై భారత్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications