'బంగారు తల్లి' మృతి: సహాయ చర్యల్లో ఎమ్మార్వో మృతి
నిజామాబాద్/ఏలూరు: రచ్చబండ కార్యక్రమంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో బంగారు తల్లి దరఖాస్తుల కోసం భారీగా జనం ఎగబడ్డారు. రేణుక అనే మహిళ తన మూడు నెలల పాప మోక్షతో కలిసి వచ్చింది.
దరఖాస్తు నమోదు చేయుంచుకోవడం కోసం జనం ఎగబడిన క్రమంలో రేణుక కూతురు మోక్షకు ఊపిరి ఆడలేదు. దీంతో ఆ చిన్నారి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. బాధితులు భవానీపేట తండాకు చెందిన వారు.

తహసీల్దారు మృతి
హెలెన్ తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్తున్న తహసీల్దారు ప్రమాదంలో మృతిచెందారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బట్లమగుటూరు వద్ద తహసీల్దారు సత్యనారాయణ కారు చెట్టుకు ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
తుఫాను గాలుల వల్ల విరిగిన చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయి ఉన్నాయి. వెనుక నుండి లారీ వస్తుండటం, దగ్గరలో మలుపు ఉండటంతో కారు చెట్టుకు ఢీకొంది. కాగా, హెలెన్ తుఫాను కోస్తాంధ్ర ప్రాంతాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. హెలెన్ తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 7గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications